Movie News

రాజా సాబ్ రేయి కోసం రాష్ట్రాలు వెయిటింగ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ జిఓ త్వరగా వచ్చేయడంతో 1000 రూపాయల ఫ్లాట్ రేట్ తో టికెట్ల అమ్మకాలు మొదలైపోయాయి. సెంటర్ కెపాసిటీనిని బట్టి కొన్ని చోట్ల 800, 600 ధరలు కూడా పెట్టారు. రేపటి నుంచి ప్రభుత్వం అనుమతించిన ప్రకారం పది రోజుల పాటు ఏపీ హైక్స్ అమలులో ఉంటాయి.

అంటే పండగ అయిపోయే వరకు రాజా సాబ్ ని రెగ్యులర్ రేట్లతో చూడటం సాధ్యం కాదు. గతంలో పుష్ప 2కి కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. ఇక తెలంగాణ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు కానీ జిఓ వల్ల అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది.

ఇదిలా ఉండగా రాజా సాబ్ చుట్టూ చాలా ఇష్యూస్ ఉన్నాయి. నైజామ్ లో సింగల్ స్క్రీన్లు దక్కలేదనే అంశం మీద ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంతో ఉన్నారు. కూకట్ పల్లి లాంటి కీలకమైన ప్రాంతాల్లో ఒక్క థియేటర్ ఇవ్వకపోవడం గురించి సోషల్ మీడియా వేదికగా నిరసన తెలియజేస్తున్నారు.

వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తామని నిర్మాత విశ్వప్రసాద్ హామీ ఇస్తున్నారు కానీ అంత ఈజీగా తెలేలా లేదు. ఇది కాసేపు పక్కనపెడితే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలతో మొదలు ట్విట్టర్, ఇన్స్ టా, ఫేస్ బుక్ తదితర సామజిక మాధ్యమాలు రాజా సాబ్ టాక్ తో హోరెత్తబోతున్నాయి. అఫ్కోర్స్ వాటిలో స్పాయిలర్స్ ఉండే ఛాన్స్ లేకపోలేదు.

నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందినట్టు చెబుతున్న రాజా సాబ్ 2026లో వస్తున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ కారణంగానే బయ్యర్ వర్గాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. దీంతో మొదలుపెట్టి వరసగా రాబోయే సినిమాలతో రెండు మూడు వారాలు థియేటర్లు కళకళలాడతాయని కోరుకుంటున్నారు.

ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ సులభంగా దాటేసిన రాజా సాబ్, నైజామ్ అమ్మకాలు మొదలుకాకుండానే గంటకు ఏడు వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం శుభసూచకం. మొదటిసారి హారర్ జానర్ టచ్ చేసిన ప్రభాస్ ని దర్శకుడు మారుతీ వింటేజ్ రూపాల్లో చూపించబోతున్నారు. కనెక్ట్ అయితే మాత్రం బాక్సాఫీస్ జాతరే.

This post was last modified on January 8, 2026 1:23 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…

54 minutes ago

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

7 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

8 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

9 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

10 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

11 hours ago