సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు నుంచి ఇటీవల రిలీజ్ చేసిన ఒక పాటలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అందులో చిరు, వెంకీల మీద తీసిన మెగా విక్టరీ పాటలో ఒక చోట.. లిరక్ను మధ్యలో మార్చిన విషయం బయటపడిపోయింది.
ఈ పాటలో చిరు.. “ఏంది వెంకీ సంగతి”.. అంటే, “అదిరిపోద్ది సంక్రాంతి” అని వెంకీ అంటాడు. తర్వాత వెంకీ.. “ఏంది బాసూ సంగతి” అంటే.. “ఇరగదీద్దాం సంక్రాంతి” అని చిరు బదులిస్తాడు. ఐతే ఆ పాటలో విజువల్స్ను జాగ్రత్తగా గమనిస్తే.. “ఇరగదీద్దాం సంక్రాంతి” అన్న చోట చిరుకు లిప్ సింక్ ఉండదు.
ఆయన వాస్తవంగా “మనదే కదా సంక్రాంతి” అన్నట్లుగా అర్థమవుతుంది. మరి మధ్యలో లిరిక్ ఎందుకు మార్చారన్నది ఆసక్తికరం. మనదే సంక్రాంతి అంటే పండక్కి వస్తున్న మిగతా సినిమాలను చిన్నబుచ్చినట్లు అవుతుంది.. అవి ఫెయిలవ్వాలని కోరుకున్నట్లు ఉంటుంది.
అందులోనూ రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ సీనియర్ల పట్ల గౌరవభావాన్ని చూపించిన తీరు చూశాక ఆ లిరిక్ అలా ఉంచడం కరెక్ట్ కాదని మన శంకర వరప్రసాద్ గారు టీం భావించినట్లుంది. చిరు, వెంకీలను ఉద్దేశించే ప్రభాస్ అలా మాట్లాడాడన్నది స్పష్టం. అందుకే అనిల్ రావిపూడి టీం లిరిక్ను మార్చిందని అంతా అనుకున్నారు.
ఇప్పుడు ఆ విషయాన్ని చిరునే స్వయంగా ధ్రువీకరించారు. బుధవారం రాత్రి జరిగిన మన శంకర వరప్రసాద్ గారు ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరు మాట్లాడుతూ.. మనదే కదా సంక్రాంతి అని ఉన్న లిరిక్ను.. ఇరగదీద్దాం సంక్రాంతి అని మార్చామని సంకేతాలు ఇచ్చారు.
ఈ సంక్రాంతి కేవలం మన శంకర వరప్రసాద్దే కాదు మొత్తం తెలుగు సినీ పరిశ్రమది అని చెప్పాలన్న ఉద్దేశంతోనే అలా చేశామని చిరు చెప్పుకొచ్చారు. చిరు, వెంకీలను ప్రభాస్ అలా గౌరవిస్తూ.. చిరు అండ్ టీం ఇలా రియాక్టవడం మంచి పరిణామం అని.. సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలూ విజయవంతమై తెలుగు సినిమా పరిశ్రమలో పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.
This post was last modified on January 8, 2026 8:02 am
రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…