చాలా గ్యాప్ తర్వాత సమంతా ఫుల్ లెన్త్ మూవీతో రాబోతోంది. తనే నిర్మించిన శుభంలో చిన్న క్యామియో చేసినప్పటికీ అది ఫ్యాన్స్, ఆడియన్స్ కి పెద్దగా రిజిస్టర్ కాలేదు. సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ కూడా ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో తనను పూర్తి పాత్రలో స్క్రీన్ మీద చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోరిక నెరవేరబోతోంది. సామ్ తో ఓ బేబీ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి మా ఇంటి బంగారంగా త్వరలోనే థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఎల్లుండి జనవరి 9 టీజర్ తో తన పాత్రను పరిచయం చేయడానికి ముహూర్తం పెట్టుకున్నారు.
అంతా బాగానే ఉంది కానీ అదే రోజు ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ ఉంది. ముందు రాత్రి ప్రీమియర్ల నుంచే దీని తాలూకు హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. టాక్స్, రివ్యూస్, స్పాయిలర్స్ ఇలా మాములు హంగామా ఉండదు. అందులోనూ ప్రభాస్ చాలా గ్యాప్ ఇచ్చేశాడు.
కల్కి 2898 ఏడి తర్వాత కన్నప్ప గెస్ట్ రోల్ తప్ప తెరమీద కనిపించలేదు. అందుకే రాజా సాబ్ తమ ఆకలి తీరుస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మా ఇంటి బంగారం అదే సమయాన్ని ఎంచుకుంది. అది కూడా ఉదయం పది గంటలకు. ఈ ముహూర్తమంటే కోరుకున్నంత అటెన్షన్ రాకపోయే రిస్క్ ఉంది.
ఎలాగూ జనవరి 10 సినిమాలేం లేవు. తిరిగి 12 నుంచి క్యూ కట్టాయి. అలాంటప్పుడు మధ్యలో స్లాట్ ఎంచుకోవాలి కానీ ఇలా ఎందుకు నిర్ణయించుకున్నారో కంటెంట్ చూస్తే కానీ క్లారిటీ రాదు. టైటిల్ హోమ్లీగా ఉన్నప్పటికీ మా ఇంటి బంగారంలో క్రైమ్, రివెంజ్ ఎలిమెంట్స్ ప్రధానంగా ఉంటాయట.
సంతోష్ నారాయణన్ సంగీతం మరో ఆకర్షణ కానుంది. సమంత జీవిత భాగస్వామి రాజ్ నిడుమూరు పర్యవేక్షణలో మా ఇంటి బంగారం నిర్మాణం జరిగింది. సినిమా రిలీజ్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ సమ్మర్ ని టార్గెట్ చేసుకుంటున్నారు. టీజర్ తో పాటు విడుదల తేదీని ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి.
This post was last modified on January 7, 2026 6:24 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…