భయపడినంతా అయ్యింది. రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడుకి ఇంకా అడ్డంకులు తొలగలేదు. సెన్సార్ సర్టిఫికెట్ లో జరుగుతున్న ఆలస్యం గురించి మదరాసు హైకోర్టుని ఆశ్రయించిన నిర్మాతలకు సానుకూల వాతావరణం ఏర్పడలేదు.
తీర్పుని జనవరి 9 ఉదయానికి రిజర్వ్ చేస్తూ కేసుని వాయిదా వేశారు. కానీ రిలీజ్ డేట్ అదే రోజు కావడంతో ఓవర్సీస్ ప్రీమియర్లు క్యాన్సిల్ చేస్తే తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికే మూడు మిలియన్ మార్క్ దాటేసిన జన నాయగన్ అనుకున్న టైంకి షోలు వేయకపోతే ఆడియన్స్ కి మొత్తం రీ ఫండ్ చేయాల్సి ఉంటుంది.
సమయం తక్కువగా ఉన్నప్పటికీ సుప్రీమ్ కోర్టులో అత్యవసర మోషన్ పిటీషన్ వేసే సాధ్యాసాధ్యాలను జన నాయకుడు లీగల్ టీమ్ పరిశీలిస్తోంది. ఒకవేళ రేపటి లోగా హియరింగ్ తో పాటు జడ్జ్ మెంట్ వస్తే ఏ టెన్షన్ ఉండదు. లేకపోతే మొత్తం అల్లకల్లోలం అవుతుంది.
జనవరి 9 హైకోర్టు అనుమతులు ఇచ్చినా అప్పటికీ తగ్గిపోయిన షోల వల్ల కలిగే ఎఫెక్ట్ వసూళ్ల మీద పడుతుంది. ఈ లెక్కన తెలుగు వెర్షన్ అదే రోజు వచ్చే ఛాన్స్ లేనట్టే. అదే జరిగితే రాజా సాబ్ కు ఏపీ తెలంగాణలో మొత్తం ఫ్రీ గ్రౌండ్ దొరుకుతుంది. రాత్రి ప్రీమియర్లతో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఆలస్యం తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు ఊపెక్కిపోతాయి.
సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్న జన నాయకుడు పరిణామాలు అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. కాంపిటీషన్ లో పరాశక్తికి సైతం సెన్సార్ సమస్య ఉన్నప్పటికీ జనవరి 10 రిలీజ్ కాబట్టి ఆలోగా పరిష్కారం అవుతుందనే ధీమాలో ఉంది.
విజయ్ సినిమా ఇబ్బందుల వెనుక ఏమైనా రాజకీయ శక్తులు ఉన్నాయా అనే దానికి ఇంకా సమాధానం దొరకాల్సి ఉంది. ఎల్లుండి సానుకూలంగా తీర్పు వచ్చినా షోలు బాగా ఆలస్యమవుతాయి. భగవంత్ కేసరి రీమేక్ గా కీలకమైన మార్పులు చేసుకుని రూపొందిన జన నాయకుడులో పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు తెలుగులో శ్రీలీల చేసిన క్యారెక్టర్ లో కనిపించనుంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…