ఈ రోజు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు నిర్మాత దిల్ రాజు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. వెంకీ నుంచి గత ఏడాది వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ ‘ఎఫ్-2’కు సీక్వెల్ అయిన ‘ఎఫ్-3’ ఫస్ట్ లుక్ను సడెన్గా లాంచ్ చేసేశాడు. ఈ సినిమా ఎప్పుడో ఖరారైంది. స్క్రిప్టు కూడా రెడీ అయింది. త్వరలో షూటింగ్ అంటున్నారు. కానీ ఇప్పుడే ఫస్ట్ లుక్ వచ్చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.
ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటో ఈ పోస్టర్ను చూస్తే అర్థమైపోతుంది. ‘ఎఫ్-2’లో భార్యా భర్తల మధ్య గొడవలు, అపార్థాలు, అలకల నేపథ్యంలో కథ నడిస్తే.. ఈసారి డబ్బు చుట్టూ కథ నడిపించబోతున్నాడు అనిల్ రావిపూడి. వెంకీ, వరుణ్ ఇద్దరూ ట్రాలీ బాస్కెట్లలో బోలెడంత డబ్బు నింపుకుని వెళ్తున్నట్లుగా ఈ పోస్టర్ రూపొందించారు. టైటిల్లో, పోస్టర్ ఎక్కడ చూసినా డబ్బే డబ్బు.
“ఇష్యూ డబ్బులు అయినపుడు మరి ఫన్ పీక్స్లో ఉంటుందిగా.. అంతేగా అంతేగా..” అంటూ ఈ పోస్టర్కు క్యాప్షన్ కూడా జోడించాడు అనిల్ రావిపూడి. డబ్బు చుట్టూ తిరిగే కామెడీ సినిమాలు గతంలో తెలుగులో చాలానే వచ్చాయి. ఈ మధ్య కాలంలో వాటి జోరు కొంచెం తగ్గింది. పాత కథల్నే తిరగేసి.. తనదైన కామెడీ జోడించి జనాల్ని ఎంటర్టైన్ చేయడం అనిల్ శైలి. ‘ఎఫ్-3’ విషయంలోనూ అదే చేయబోతున్నాడని స్పష్టమవుతోంది.
‘ఎఫ్-2’లో నటించిన తమన్నా, మెహ్రీన్ ఈ సినిమాలో కూడా వెంకీ, వరుణ్లతో జోడీ కట్టబోతున్నారు. వీరికి తోడు వేరే గ్లామర్ అట్రాక్షన్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇందులో మరో హీరో కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఐతే పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి ప్రేక్షకులు కోరుకున్న దాని కంటే ఎక్కువ వినోదాన్నందించింది ‘ఎఫ్-2’. ఐతే ఈసారి అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని అందుకోవడం అనిల్కు అంత తేలిక కాదు.
This post was last modified on December 13, 2020 2:01 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…