ఎల్లుండి విడుదల కాబోతున్న రాజా సాబ్ మన దగ్గర సౌండ్ చేయడంలో ఆశ్చర్యం లేదు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా ఊపులోకి రాకపోవడం అభిమానులను ఖంగారు పెడుతోంది. బాలీవుడ్లో మన హీరోల్లో ఎవరికీ లేని మార్కెట్ ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. రాధే శ్యామ్ ఇక్కడ ఫెయిలైనా హిందీలో కమర్షియల్ గా పే చేసింది.
సలార్, కల్కిలు భారీ లాభాలిచ్చాయి. కొన్ని చోట్ల సాహో రికార్డులు భద్రంగా ఉన్నాయి. అలాంటిది రాజా సాబ్ కి ఏ రేంజ్ లో మార్కెటింగ్ చేయాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ముగ్గురు హీరోయిన్ల సాంగ్ ని వాళ్ళతోనే ప్రభాస్ లేకుండా ముంబైలో లాంచ్ చేయడం తప్ప వేరే ఏం చేయలేదు.
ఇలా జరగడానికి కారణాలు లేకపోలేదు. రాజా సాబ్ టీమ్ ఒత్తిడిలో ఉంది. దర్శకుడు మారుతీ ఇక్కడ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఇంకో వైపు చివరి దశ పనులను చూసుకుంటూ ఏకంగా ల్యాబ్ లోనే పడుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇంకోవైపు ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం, సందీప్ వంగాతో ఒక ఇంటర్వ్యూ చేయించుకోవడం మినహా వేరే దర్శనం లేదు.
సో ఉత్తరాది ప్రేక్షకులకు రాజా సాబ్ మీద పూర్తి స్థాయి ఆసక్తి కలగలేకపోవడానికి వీటినే అక్కడి విశ్లేషకులు రీజన్స్ గా చూపిస్తున్నారు. అఖండ 2 కోసం బాలయ్య, బోయపాటి శీను ఎన్ని టూర్లు వేశారో తెలిసిందే. అయినా అక్కడ అనుకున్న ఫలితం దక్కలేదు.
ఈ ధీమా ఎందుకంటే ప్రశ్నకు సమాధానం ఒకటే. రాజా సాబ్ కనక ఎక్స్ ట్రాడనరిగా ఉంటే ఎలాంటి పబ్లిసిటీ అక్కర్లేదు. జనాలు నెత్తిన బెట్టుకుంటారు. రిలీజ్ కు ముందు వరకు నెగటివ్ క్యాంపైన్ నడిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ అయ్యింది.
అసలే బాలీవుడ్ లో హారర్ జానర్ కు మంచి ఆదరణ ఉంది. స్త్రీ 2, ముంజ్యా, భూల్ భూలయ్యా 3 లాంటివి కనకవర్షం కురిపించాయి. అవన్నీ స్టార్లు లేని సినిమాలు. కానీ రాజా సాబ్ లో ప్రభాస్ ఉన్నాడు. సో బాగుందనే మాట వస్తే చాలు ఆటోమేటిక్ గా పికప్ అయిపోతుంది. కాకపోతే అది యునానిమస్ గా ఉంటేనే గట్టిగా నిలబడొచ్చు.
This post was last modified on January 7, 2026 12:18 pm
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. సమావేశాలను వారు ప్రత్యక్షంగా…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…