ఎల్లుండి విడుదల కాబోతున్న రాజా సాబ్ మన దగ్గర సౌండ్ చేయడంలో ఆశ్చర్యం లేదు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా ఊపులోకి రాకపోవడం అభిమానులను ఖంగారు పెడుతోంది. బాలీవుడ్లో మన హీరోల్లో ఎవరికీ లేని మార్కెట్ ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. రాధే శ్యామ్ ఇక్కడ ఫెయిలైనా హిందీలో కమర్షియల్ గా పే చేసింది.
సలార్, కల్కిలు భారీ లాభాలిచ్చాయి. కొన్ని చోట్ల సాహో రికార్డులు భద్రంగా ఉన్నాయి. అలాంటిది రాజా సాబ్ కి ఏ రేంజ్ లో మార్కెటింగ్ చేయాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ముగ్గురు హీరోయిన్ల సాంగ్ ని వాళ్ళతోనే ప్రభాస్ లేకుండా ముంబైలో లాంచ్ చేయడం తప్ప వేరే ఏం చేయలేదు.
ఇలా జరగడానికి కారణాలు లేకపోలేదు. రాజా సాబ్ టీమ్ ఒత్తిడిలో ఉంది. దర్శకుడు మారుతీ ఇక్కడ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఇంకో వైపు చివరి దశ పనులను చూసుకుంటూ ఏకంగా ల్యాబ్ లోనే పడుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇంకోవైపు ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం, సందీప్ వంగాతో ఒక ఇంటర్వ్యూ చేయించుకోవడం మినహా వేరే దర్శనం లేదు.
సో ఉత్తరాది ప్రేక్షకులకు రాజా సాబ్ మీద పూర్తి స్థాయి ఆసక్తి కలగలేకపోవడానికి వీటినే అక్కడి విశ్లేషకులు రీజన్స్ గా చూపిస్తున్నారు. అఖండ 2 కోసం బాలయ్య, బోయపాటి శీను ఎన్ని టూర్లు వేశారో తెలిసిందే. అయినా అక్కడ అనుకున్న ఫలితం దక్కలేదు.
ఈ ధీమా ఎందుకంటే ప్రశ్నకు సమాధానం ఒకటే. రాజా సాబ్ కనక ఎక్స్ ట్రాడనరిగా ఉంటే ఎలాంటి పబ్లిసిటీ అక్కర్లేదు. జనాలు నెత్తిన బెట్టుకుంటారు. రిలీజ్ కు ముందు వరకు నెగటివ్ క్యాంపైన్ నడిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ అయ్యింది.
అసలే బాలీవుడ్ లో హారర్ జానర్ కు మంచి ఆదరణ ఉంది. స్త్రీ 2, ముంజ్యా, భూల్ భూలయ్యా 3 లాంటివి కనకవర్షం కురిపించాయి. అవన్నీ స్టార్లు లేని సినిమాలు. కానీ రాజా సాబ్ లో ప్రభాస్ ఉన్నాడు. సో బాగుందనే మాట వస్తే చాలు ఆటోమేటిక్ గా పికప్ అయిపోతుంది. కాకపోతే అది యునానిమస్ గా ఉంటేనే గట్టిగా నిలబడొచ్చు.
This post was last modified on January 7, 2026 12:18 pm
వస్తువులకే కాదు సినిమాలకు కూడా మార్కెటింగ్ చాలా అవసరం. ప్రేక్షుకులు టికెట్లు కొనేలా చేయాలంటే కేవలం పోస్టర్లతో పనయ్యే కాలం…
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…