తెలుగులో, అలాగే ఇతర భాషల్లో అనేక మంది దేవుళ్ల మీద సినిమాలు వచ్చాయి. శివుడి మీద అయితే సినిమాలకు లెక్కే లేదు. అనేక సినిమాల్లో వినాయకుడి పాత్రను కూడా చూశాం. కానీ శివుడి చిన్న కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి కథ గురించి సినిమాల్లో చూపించిన సందర్భాలు అరుదు. ఇప్పుడు ఆ దేవుడి మీద సినిమా అనేసరికి అందరూ అమితాసక్తి చూపించారు.
అందులోనూ త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకుడు తొలిసారిగా మైథలాజికల్ ప్రాజెక్టు చేయబోతూ.. సుబ్రహ్మణ్యస్వామి కథను చెప్పాలనుకోవడంతో క్యూరియాసిటీ పెరిగింది. ఈ ప్రాజెక్టు గత రెండేళ్లుగా చర్చల్లో ఉంది. ముందు అల్లు అర్జున్ గాడ్ ఆఫ్ వార్గా పేరున్న సుబ్రహ్మణ్యస్వామి క్యారెక్టర్ చేస్తాడని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆ సినిమా బన్నీ వైపు వెళ్లిందంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఇలా నడుస్తుండగా.. సుబ్రహ్మణ్యస్వామి మీద వేరే సినిమా చర్చల్లోకి రావడం విశేషం.
నేను శైలజ, చిత్రలహరి లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన దర్శకుడు కిషోర్ తిరుమల కూడా సుబ్రహ్మణ్యస్వామి కథ చేయాలనుకున్నాడట. ఇందుకోసం గౌరీ తనయ పేరుతో నాలుగేళ్ల ముందే స్క్రిప్టు పనులు మొదలుపెట్టాడట. కథ కూడా రెడీ అయిందట. ఐతే పెద్ద స్పాన్ ఉన్న కథ కావడంతో ఎక్కువ బడ్జెట్, పేరున్న నటీనటులు, టెక్నీషియన్లు అవసరమని.. అందుకోసం ప్రయత్నం చేస్తున్నానని కిషోర్ తిరుమల తెలిపాడు.
ఇప్పటిదాకా ప్రేమకథలు, ఫ్యామిలీ స్టోరీలే డీల్ చేసిన కిషోర్.. ఇంత పెద్ద కథ రాసి భారీ బడ్జెట్లో సినిమా తీయగలడని ఎవరూ అనుకోరు. కానీ రంగంలోకి కానీ దర్శకుల అసలు సత్తా ఏంటన్నది అర్థం కాదు. మరి కిషోర్ను నమ్మి ఏ నిర్మాత అయినా భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమా తీసే ప్రయత్నం చేస్తాడేమో చూడాలి.
అంతకంటే ముందు రవితేజ హీరోగా కిషోర్ డైరెక్ట్ చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ప్రేక్షకులను మెప్పించాలి. సంక్రాంతి కానుకగా ఈ నెల 13న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…