గత నవంబర్ లో విడుదలైన మలయాళ సినిమా ఎకో కేవలం అయిదు కోట్ల బడ్జెట్ తో రూపొంది యాభై కోట్లకు పైగా వసూళ్లతో ఔరా అనిపించింది. హైదరాబాద్ లో కొన్ని రోజులు నాన్ స్టాప్ గా హౌస్ ఫుల్ అయిన ఘనత దీనికి ఉంది. తెలుగు వెర్షన్ లేకపోయినా సబ్ టైటిల్స్ తో చూసి మరీ తమ ఆకలి తీర్చుకున్నారు మూవీ లవర్స్.
అప్పటి నుంచే దీని ఓటిటి రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తూ వచ్చారు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యింది. అన్ని ప్రధాన భాషల్లో అనువాదం చేయడంతో ఇబ్బంది తగ్గిపోయింది. ఇప్పుడీ మూవీకి సోషల్ మీడియాతో పాటు ఆఫ్ లైన్ లో పాజిటివ్ మద్దతు దొరుకుతోంది.
పచ్చిగా చెప్పాలంటే ఇదో కుక్కల మూవీ. అంటే ప్రత్యేకంగా హీరో ఎవరూ ఉండరు. కేవలం పాత్రలే ఉంటాయి. మనకు ప్రేమదేశం వినీత్ తప్ప గుర్తు పట్టే ఆర్టిస్టులు వేరే ఉండరు. కర్ణాటక కేరళ సరిహద్దుల్లో ఉండే ఒక ఎత్తయిన అడవి కొండ మీద కురియచన్ అనే వ్యక్తి కుక్కలను పెంచుకుంటూ వందల ఎకరాలు కొనేస్తాడు.
ఓ రోజు వయసైపోయిన భార్యను వదిలేసి మాయమైపోతాడు. ఆమెను చూసుకోడానికి జీతం మీద షీమోన్ అనే కుర్రాడు వస్తాడు. పోలీసులు, రకరకాల వ్యక్తులు కురియచన్ కోసం వెతుకుతూ ఉంటారు. అసలు అతను ఏమైపోయాడు, కొండ మీద ఉన్న ఇల్లు రహస్యం ఏంటి అనేదే అసలు స్టోరీ.
ఎకోని ఎందుకు చూడాలనే ప్రశ్న అడిగితే దానికి ఒకే సమాధానం టెక్నికల్ బ్రిలియన్స్. కథగా ఇది రెగ్యులర్ మల్లువుడ్ స్టైల్ లో నెమ్మదిగా సాగుతుంది. కానీ కాన్సెప్ట్ కి కనెక్ట్ అయితే మాత్రం ఫార్వర్డ్ చేయకుండా చూస్తాం. పాటలు, హీరోయిన్, లవ్ ట్రాక్, కామెడీ ఇవేవి లేకుండా కేవలం కుక్కలు, మాయమైపోయిన మనిషి చుట్టూ నడిపించిన క్రైమ్ డ్రామా ఆగకుండా చూసేలా చేస్తుంది.
ముఖ్యంగా లొకేషన్లు కళ్ళు పక్కకు తిప్పుకోనివ్వవు. కిష్కిందకాండం, సూక్ష్మదర్శిని లాంటి మలయాళీ స్లో థ్రిల్లర్లు నచ్చినవాళ్ళకు ఎకో మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇవి అలవాటు లేని వాళ్ళు భరించడం కొంచెం కష్టమే.
This post was last modified on January 5, 2026 5:22 pm
ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా…
గాడ్ ఆఫ్ వార్.. ఏడాది కిందట్నుంచి టాలీవుడ్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న ప్రాజెక్టు. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ, మాస్, యాక్షన్…
సినిమాల్లో పాత్రలను కొంతమంది నిజ జీవితంలో కూడా ఎంతో ఓన్ చేసుకుంటారు. తెరపై వారికి అన్యాయం జరిగితే నిజంగానే వారికేదో నష్టం…
పార్లమెంటులో డీలిమిటేషన్ సహా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు.. ఎంతసమయమైనా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ వ్యవహారంపై…
అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై…
వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ…