తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ చివరి సినిమా ‘జననాయగన్’ ఇంకో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూడు దశాబ్దాలకు పైగా తమను అలరిస్తున్న విజయ్.. ఈ సినిమాతో రిటైర్మెంట్ తీసుకోబోతుండడం అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తోంది.
మలేషియాలో గత వారం జరిగిన ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక ఫ్యాన్స్ను కదిలించేసింది. అందులో ఎన్నో ఎమోషనల్ మూమెంట్స్ కనిపించాయి. ఈ వేడుకను తాజాగా టీవీ ఛానెల్లో ప్రసారం చేశారు. ఇందులో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వేడుకకు విజయ్ తల్లిదండ్రులు శోభ, చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో విజయ్ తల్లి సింగర్గా మారి పెర్ఫామ్ చేయడం విశేషం. ఆమె మైక్ పట్టుకుని ప్రొఫెషనల్ సింగర్లతో కలిసి ఒక పాట పాడారు. ఒకట్రెండు లైన్లు పాడి వదిలేయడం కాదు.. మొత్తం పాటను ఆలపించారు శోభ.
ఐతే శోభ పాట పాడడం మొదలుపెట్టగానే ఆడిటోరియం దద్దరిల్లిపోగా.. ఆమె ఎవరో తెలియని హీరోయిన్ పూజా హెగ్డే, అంత రెస్పాన్స్ ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోయింది. పక్కనే ఉన్న విజయ్.. పూజాను పిలిచి, పాట పాడుతోంది తన తల్లి అని చెప్పాడు.
దీంతో పూజా ఆశ్చర్యంగా ఆమెను పాటను వినడం మొదలుపెట్టింది. ఇలా ఒక అగ్ర కథానాయకుడి సినిమా ఆడియో వేడుకలో తల్లి పాట పాటడం అన్నది అరుదైన దృశ్యమే. పైగా ఇది విజయ్ చివరి చిత్రం కావడంతో ఆ మూమెంట్ ఇంకా స్పెషల్గా మారింది. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…