గత కొన్నేళ్లుగా స్టార్లు నటించిన ప్యాన్ ఇండియా సినిమాలు సెన్సార్ విషయంలో రాజీ పడకుండా A సర్టిఫికెట్ తీసుకోవడానికి వెనుకాడని వైనం చూస్తున్నాం. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, కూలీ, యానిమల్, దురంధర్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్లు వందల వేల కోట్లు వసూలు చేసినా ఈ విషయంలో మాత్రం వెనక్కు తగ్గలేదు.
అయితే దీని వల్ల ఒక సమస్య ఉంది. చాలా మల్టీప్లెక్సుల్లో A ఉందనే కారణంగా పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలను థియేటర్లోకి అనుమతించడం లేదు. కానీ ఈసారి సంక్రాంతికి ఎలాంటి సమస్య ఉండబోవడం లేదు. ఎందుకంటే అన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు. యు లేదా యు/ఏ ఏదో ఒకటి తెచ్చుకుంటాయి.
రాజా సాబ్ విషయానికి వస్తే హారర్ ఎలిమెంట్స్ వల్ల యు/ఏ వచ్చేయడంతో పిల్లా పెద్దా అందరూ థియేటర్లకే క్యూ కడతారు. మన శంకరవరప్రసాద్ గారుకి అధిక శాతం క్లీన్ యు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇవాళ ఈ లాంఛనం జరిగిపోతుంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రొమాన్స్ ఉన్న కారణంగా ఓన్లీ యు రాకపోవచ్చు కానీ యు/ఏ అయితే పక్కా. అనగనగా ఒక రాజులో వినోదానిదే డామినేషన్ కాబట్టి సెన్సార్ ఏమిస్తుందో సులభంగా గెస్ చేయొచ్చు. నారి నారి నడుమ మురారి కూడా ఫ్యామిలీ క్యాటగిరీనే. జన నాయకుడు డబ్బింగ్ క్యాటగిరీ అందులోనూ భగవంత్ కేసరి రీమేక్ కనక పరిగణనలోకి తీసుకోవడం లేదు.
డిసెంబర్ కొంచెం డ్రైగా గడిచిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఇండస్ట్రీ ఆశలన్నీ సంక్రాంతి పండగ మీదే ఉన్నాయి. టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ షోలు, థియేటర్ల పంపకాలు ఇవన్నీ వీలైనంత త్వరగా కొలిక్కి రావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఈసారి పండగ బరిలో వందల కోట్లతో రూపొందిన మూవీ రాజా సాబ్ ఒకటే. ప్రొడక్షన్ పరంగా మిగిలినవన్నీ డీసెంట్ బడ్జెట్ లోనే పూర్తి చేసుకున్నవి. కీలకమైన సీజన్ కాబట్టి యావరేజ్ టాక్ వచ్చినా చాలు నిర్మాతలు గట్టెక్కిపోతారు. జనవరి 10 నుంచి స్కూల్స్, కాలేజీల సెలవులు మొదలుకాబోతున్న నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు జనాల సందడి కోసం రెడీ అవుతున్నాయి.
This post was last modified on January 5, 2026 2:08 pm
ఇవాళని మినహాయిస్తే జన నాయకుడు విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఇంకా సెన్సార్ సమస్యలు తొలగిపోలేదు. అధికారులు…
ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన విషయం బయటపడింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) విడుదల చేసిన కొత్త…
మూవీ లవర్స్ పాతికేళ్ల క్రితమే కోరుకున్న కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం. కానీ రెండుసార్లు…
ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్లో ఎన్నడూ లేనంత పోటీని చూడబోతున్నాం. తెలుగు నుంచి ఏకంగా అయిదు సినిమాలు రిలీజవుతున్నాయి. వీటికి…
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకునే కానుకల హుండీ పరకామణిలో దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. 2021-22 మధ్య కాలంలో రవికుమార్…
వైసీపీ అధినేత జగన్పై విమర్శల జోరు పెంచాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఎలా ఉన్నా, గత…