త్రివిక్రమ్ శ్రీనివాస్ గొప్ప రచయిత, దర్శకుడు అనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఆయన సతీమణి సాయి సౌజన్య ప్రతిభ గురించి తెలిసిన వాళ్లు తక్కువ మందే. దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మేనకోడలైన సాయి సౌజన్య క్లాసికల్ డ్యాన్సర్. లో ప్రొఫైల్ మెయింటైన్ చేసే సాయి సాజన్య.. అప్పుడప్పుడూ తన భరతనాట్యం ప్రతిభను వేదికల మీద ప్రదర్శిస్తుంటారు. గతంలో ఆమె ప్రదర్శనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.
తాజాగా ఆమె మరోసారి భరత నాట్యం ప్రదర్శన ఇచ్చింది. అది చూస్తే తన అసాధారణ ప్రతిభ గురించి తెలుస్తుంది. అద్భుతమైన నృత్యం.. చక్కటి హావభావాలతో ఆకట్టుకున్నారు సాయి సౌజన్య. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సాయిసౌజన్యకు ఎదిగిన కొడుకు ఉన్నాడు. ఈ వయసులోనూ ఆమె అద్భుతంగా నృత్యం చేస్తుండడం విశేషం.
సాయి సౌజన్య ప్రస్తుతం సినీ పరిశ్రమలో నిర్మాతగానూ కొనసాగుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ నిర్మించే చిత్రాల్లో ఆమె భాగస్వామిగా కొనసాగుతున్నారు. త్రివిక్రమ్ చాలా ఏళ్ల నుంచి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అది ఆయన హోం బేనర్గా మారిపోయింది. మరోవైపు సితార సంస్థ.. సాయి సౌజన్య ఆధ్వర్యంలోని ఫార్చ్యూన్ ఫోర్తో కలిసి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది. హారిక అండ్ హాసినిలో కేవలం త్రివిక్రమ్ సినిమాలే నిర్మితం అవుతాయి. సితారలో చేసే సినిమాలన్నింటినీ త్రివిక్రమ్ పర్యవేక్షిస్తుంటారు.
This post was last modified on January 5, 2026 12:22 pm
పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030…
ఏపీ రాజధాని అమరావతి రైతుల విషయంలో మరోసారి సీఎం చంద్రబాబు తన మనసు చాటుకున్నారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను…
ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకోవడం, ఎవరో ఒకరు టికెట్ రేట్లు అన్యాయమంటూ కోర్టుకు వెళ్లడం, తర్వాత సదరు మంత్రులు ఇకపై…
ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి తన మనసు చాటుకున్నారు. లోకల్గానే కాదు... విదేశాల్లో కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని…
ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఏడాదిలో తొలిసారి బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను సీఎంవో అధికారులు వివరించారు.…
ఏపీలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు చేపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయంలో సీఎం…