నివిన్ పౌలీ.. ఒకప్పుడు సౌత్ ఇండియా అంతటా మార్మోగిన పేరు. ఈ మలయాళ హీరో ప్రధాన పాత్ర పోషించిన ప్రేమమ్ సినిమా అప్పట్లో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ లవ్ స్టోరీస్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇతర భాషల వాళ్లు కూడా ఎగబడి చూశారీ చిత్రాన్ని. దీని కంటే ముందు బెంగళూరు డేస్, నేరమ్ సహా పలు చిత్రాలతో నివిన్ మెప్పించాడు. ప్రేమమ్ తర్వాత కూడా కొన్ని హిట్లు పడ్డాయి. ఒక దశలో మలయాళ టాప్ స్టార్లలో ఒకడిగా వెలుగొందాడు నివిన్.
కానీ ఆ స్థానాన్ని నిలబెట్టుకునే సినిమాలు ఆ తర్వాత చేయకపోవడంతో తన స్టార్డమ్ కరుగుతూ వచ్చింది. 2019లో లవ్ యాక్షన్ డ్రామా అనే సినిమాతో సక్సెస్ అందుకున్నాక నివిన్కు నిఖార్సయిన హిట్ అన్నదే లేకపోయింది. దీంతో నివిన్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. నెమ్మదిగా తనను ప్రేక్షకులు పట్టించుకోవడం మానేసే పరిస్థితి వచ్చింది.
ఇలాంటి టైంలో గత ఏడాది చివర్లో, క్రిస్మస్ వీకెండ్లో సర్వం మాయం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నివిన్. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. అఖిల్ సత్యన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను అమితంగా ఆకట్టుకుంటోంది.
విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకునే ఓ కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో ఒక పూజారిగా మారి.. ఓ అమ్మాయి ప్రేమలో పడే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఆద్యంతం ఆహ్లాదభరితంగా, వినోదాత్మకంగా సాగే సినిమాలో నివిన్ పౌలీ చక్కటి పెర్ఫామెన్స్ ఇచ్చాడు.
అతడికి మించి కథానాయిక పాత్ర పోషించిన రియా షిబు అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాకు ఆమెనే హైలైట్ అంటున్నారు. క్రేజీగా సాగే తన పాత్రకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ కావడం.. బోర్ కొట్టకుండా సినిమా సాగిపోవడంతో సర్వంమాయకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం దక్కింది.
ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసింది. ఒక హిట్ పడితే చాలు అనుకుంటున్న టైంలో ఏకంగా కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ రావడంతో నివిన్, తన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
This post was last modified on January 5, 2026 7:41 am
తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే.. బీజేపీ విషయంలో ఇది అక్షరాలా నిజం. తనకు అవకాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో ఎంత తలనొప్పి ఎదురైందో…
టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…
ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత..…