నివిన్ పౌలీ.. ఒకప్పుడు సౌత్ ఇండియా అంతటా మార్మోగిన పేరు. ఈ మలయాళ హీరో ప్రధాన పాత్ర పోషించిన ప్రేమమ్ సినిమా అప్పట్లో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ లవ్ స్టోరీస్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇతర భాషల వాళ్లు కూడా ఎగబడి చూశారీ చిత్రాన్ని. దీని కంటే ముందు బెంగళూరు డేస్, నేరమ్ సహా పలు చిత్రాలతో నివిన్ మెప్పించాడు. ప్రేమమ్ తర్వాత కూడా కొన్ని హిట్లు పడ్డాయి. ఒక దశలో మలయాళ టాప్ స్టార్లలో ఒకడిగా వెలుగొందాడు నివిన్.
కానీ ఆ స్థానాన్ని నిలబెట్టుకునే సినిమాలు ఆ తర్వాత చేయకపోవడంతో తన స్టార్డమ్ కరుగుతూ వచ్చింది. 2019లో లవ్ యాక్షన్ డ్రామా అనే సినిమాతో సక్సెస్ అందుకున్నాక నివిన్కు నిఖార్సయిన హిట్ అన్నదే లేకపోయింది. దీంతో నివిన్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. నెమ్మదిగా తనను ప్రేక్షకులు పట్టించుకోవడం మానేసే పరిస్థితి వచ్చింది.
ఇలాంటి టైంలో గత ఏడాది చివర్లో, క్రిస్మస్ వీకెండ్లో సర్వం మాయం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నివిన్. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. అఖిల్ సత్యన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను అమితంగా ఆకట్టుకుంటోంది.
విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకునే ఓ కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో ఒక పూజారిగా మారి.. ఓ అమ్మాయి ప్రేమలో పడే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఆద్యంతం ఆహ్లాదభరితంగా, వినోదాత్మకంగా సాగే సినిమాలో నివిన్ పౌలీ చక్కటి పెర్ఫామెన్స్ ఇచ్చాడు.
అతడికి మించి కథానాయిక పాత్ర పోషించిన రియా షిబు అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమాకు ఆమెనే హైలైట్ అంటున్నారు. క్రేజీగా సాగే తన పాత్రకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ కావడం.. బోర్ కొట్టకుండా సినిమా సాగిపోవడంతో సర్వంమాయకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితం దక్కింది.
ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసింది. ఒక హిట్ పడితే చాలు అనుకుంటున్న టైంలో ఏకంగా కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ రావడంతో నివిన్, తన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
This post was last modified on January 5, 2026 7:41 am
తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సీజన్లో మొత్తం 5 రోజుల పాటు మాత్రమే ఈ సమావేశాలు…
టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఆట తీరు గురించి సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్…
నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారులను, పోలీసులను కూడా బెదిరించిన విషయం తెలిసిందే. తాట…
పర్యాటకానికి ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా 2024-2029 స్వర్ణాంధ్ర టూరిజం పాలసీ అమల్లోకి వచ్చింది. 2030…
ఏపీ రాజధాని అమరావతి రైతుల విషయంలో మరోసారి సీఎం చంద్రబాబు తన మనసు చాటుకున్నారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను…
ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చుకోవడం, ఎవరో ఒకరు టికెట్ రేట్లు అన్యాయమంటూ కోర్టుకు వెళ్లడం, తర్వాత సదరు మంత్రులు ఇకపై…