సంక్రాంతి రేసులో రాజా సాబ్ తర్వాత ఎక్కువ అంచనాలు మోస్తున్న సినిమాగా మన శంకరవరప్రసాద్ గారు మీద మెగా ఫ్యాన్స్ ఆశలు ఏ స్థాయిలో ఉన్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఎంటర్ టైన్మెంట్ హ్యాండిల్ చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తోడవ్వడంతో ఫన్ ఏ రేంజ్ లో ఉంటుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తిరుపతిలో ఘనంగా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ జరిగిపోయింది. చెప్పిన టైంకి ఎలాంటి ఆలస్యం లేకుండా కంటెంట్ వదిలేశారు. పూర్తిగా కాదు కానీ చూచాయగా కథేంటో చెబుతూ, చెప్పీ చెప్పకుండా రివీల్ చేశారు. కొన్ని క్లూస్ మాత్రమే ఇచ్చారు.
ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసే ఆఫీసర్ వరప్రసాద్ (చిరంజీవి) మాములు జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న శశిరేఖ (నయనతార) కు దూరంగా ఎందుకు బ్రతికాల్సి వచ్చిందో అంతు చిక్కని రహస్యంగా మారుతుంది. ఈలోగా ప్రభుత్వానికి వరప్రసాద్ తో పని పడుతుంది.
దీంతో మనోడు రంగంలోకి దిగుతాడు. అదే సమయంలో తన ఫ్రెండ్ (వెంకటేష్) కూడా ఎంట్రీ ఇస్తాడు. అసలు గవర్నమెంట్ మిషన్ ఏంటి, ఉద్యోగం, కుటుంబాన్ని వదిలేసి వరప్రసాద్ ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది, అతని జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన శత్రువులు ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.
ట్రైలర్ కట్ కొంచెం హడావిడిగా అనిపించినా దర్శకుడు అనిల్ రావిపూడి తనేం చూపించబోతున్నాడో ఒక ఐడియా అయితే ఇచ్చారు. చిరంజీవి మాస్ లుక్స్ తో పాటు కొంచెం కామెడీ యాంగిల్ ని శాంపిల్ గా చూపించి, చిరు వెంకీల కలయికని ఒక డైలాగుతో బయట పెట్టేశారు.
అయితే ఫ్యాన్స్ లో ఉన్న భారీ అంచనాలకు అనుగుణంగా ట్రైలర్ ఉందా అంటే వెంటనే ఎస్ చెప్పలేని పరిస్థితి. ఇంకొంచెం బెటర్ కట్ ఉండాల్సిందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. జనవరి 9 రిలీజ్ కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు ఇంకో ఎనిమిది రోజుల్లో ప్రేక్షకులకు వినోదాల విందు వడ్డించబోతున్నారు.
This post was last modified on January 4, 2026 6:08 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…