ఇండియన్ సినిమాలో ఒక కథను రెండు భాగాలుగా తీయడం, సీక్వెల్స్ చేయడం అనే ట్రెండు బాగా ఊపందుకోవడంలో ‘బాహుబలి’ సినిమా పాత్ర కీలకం. ముఖ్యంగా ఈ మధ్య ప్రభాస్ సినిమా అంటే చాలు.. రెండో భాగం తెరపైకి వచ్చేస్తోంది. సలార్, కల్కి చిత్రాలకు సీక్వెల్స్ లైన్లో ఉండగా.. ‘ఫౌజీ’కి సైతం సీక్వెల్ ఉంటుందని వెల్లడైంది. మరి రెబల్ స్టార్ కొత్త చిత్రం ‘రాజాసాబ్’కు పార్ట్-2 ఉంటుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.
దీని గురించి దర్శకుడు మారుతి తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ట్రైలర్లో చూసిన ‘జోకర్’ షాట్.. పార్ట్-2కు లీడ్ ఇవ్వడం కోసమే పెట్టినట్లు అతను వెల్లడించాడు. ఐతే పార్ట్-2కు ఇంకా స్క్రిప్టు ఏమీ రెడీ కాలేదని కూడా అతను క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికి లీడ్ ఇస్తామని.. తర్వాత అన్నీ అనుకూలించడాన్ని బట్టి పార్ట్-2 ఉంటుందని అతను తెలిపాడు.
రాజాసాబ్-2 కోసం ఇప్పుడున్న కథను సాగదీయడం లాంటిదేమీ చేయనని మారుతి స్పష్టం చేశాడు. పార్ట్-2 విషయంలో ఏం చేయాలి అనే విషయంలో తనకు, ప్రభాస్కు ఫుల్ క్లారిటీ ఉందని.. కథను సాగదీస్తారేమో అని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు మారుతి. ఇంతకుముందు ఓ సందర్భంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. సీక్వెల్ గురించి క్లారిటీగా చెప్పకుండా ‘రాజాసాబ్’ ప్రపంచం కొనసాగుతుందని మాత్రం వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం మారుతి మాటల్ని బట్టి చూస్తుంటే.. పార్ట్-2కు లీడ్ ఇచ్చి, ఈ సినిమాకు వచ్చే ఫలితాన్ని బట్టి, ప్రభాస్ వీలును బట్టి కొత్తగా ఇంకో కథ రాసి దాన్ని రాజాసాబ్-2గా తీసుకొస్తారని అర్థమవుతోంది. మరి ఈ నెల 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రాజాసాబ్’కు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
This post was last modified on January 4, 2026 1:29 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…