‘ఓనమాలు’ అనే మంచి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు క్రాంతి మాధవ్. ఇది కమర్షియల్గా పెద్దగా ఆడకపోయినా.. క్రాంతిమాధవ్కు మంచి పేరొచ్చింది. దీంతో సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు పిలిచి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా చేసే అవకాశమిచ్చారు. రెండో సినిమాతో దర్శకుడిగా మరి కొన్ని మెట్లు ఎక్కాడు క్రాంతి మాధవ్. అదొక కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది. కానీ ఈ సినిమా కూడా కమర్షియల్గా ఓ మోస్తరు ఫలితాన్నే అందుకుంది.
ఐతే తొలి రెండు చిత్రాలతో దర్శకుడిగా వచ్చిన పేరును తర్వాతి చిత్రాలతో క్రాంతి దెబ్బ తీసుకున్నాడు. సునీల్ హీరోగా ఆయన తీసిన మూడో చిత్రం ‘ఉంగరాల రాంబాబు’ ప్రేక్షకులకు చుక్కలు చూపించింది. క్రాంతి నుంచి ఇలాంటి సినిమాను ఎవ్వరూ ఊహించలేదు. అయినా సరే విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరోతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తీసే అవకాశం అందుకున్నాడు క్రాంతి. ఈ చిత్రాన్ని కూడా కేఎస్ రామారావే నిర్మించారు. కానీ ఈ చిత్రం ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది.
క్రాంతి మాధవ్ కొన్నేళ్ల పాటు కనిపించకుండా పోయాడు. మధ్యలో ‘డీజీఎల్’ ఒక సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు కానీ.. అది ముందుకు కదల్లేదు. కట్ చేస్తే ఇప్పుడు క్రాంతి మాధవ్ కొత్త సినిమా కబురుతో పలకరించాడు. తన కొత్త సినిమా పేరు.. దిల్ దియా. ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్తో మంచి పేరు సంపాదించి.. ఆ తర్వాత ‘కీడా కోలా’ సహా పలు చిత్రాల్లో నటించిన చైతన్యరావు ఇందులో లీడ్ రోల్ చేస్తున్నాడు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ లాంచ్ చేశాడు. క్రాంతికి సందీప్ క్లోజ్ ఫ్రెండ్. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే.. తన ఫ్రెండు నుంచి క్రాంతి ఇన్స్పైర్ అయినట్లుంది. ఇందులో చైతన్య రావు న్యూడ్ బోల్డ్ లుక్లో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చాడు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ను మించి బోల్డ్గా ఈ సినిమా తీయడానికి క్రాంతిమాధవ్ రెడీ అయినట్లున్నాడు. పూర్ణ నాయుడు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రానికి ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్నాడు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on January 3, 2026 2:36 pm
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సువార్తీకుడు కేఏ పాల్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ…
తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే.. బీజేపీ విషయంలో ఇది అక్షరాలా నిజం. తనకు అవకాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…
ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో ఎంత తలనొప్పి ఎదురైందో…
టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024…