ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడం కోసం ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు అడ్వాన్సులిచ్చి.. ఏవో సమస్యలొచ్చి ఆ సినిమాను ఆపేయడం ఇండస్ట్రీలో మామూలే. కానీ సినిమా చేసే ఉద్దేశం లేకపోయినా.. ఊరికే అడ్వాన్సులిచ్చి ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తన వైపు తిప్పించుకుని.. తర్వాత సినిమా లేదు ఏం లేదు అని చెప్పే నిర్మాత కూడా ఇండస్ట్రీలో ఉంటారని ఎవరైనా అనుకుంటారా?
ఇలాంటి ఓ వ్యక్తి టాలీవుడ్లో ఉన్నాడని అంటున్నాడు ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన యువ నటుడు అఖిల్ రాజ్. తనతో ఒక నిర్మాత అలాగే ఆడుకున్నట్లు అతను మా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘‘ఒక నిర్మాత సినిమా ఓపెనింగ్ చేశాడు. అతను ఫేక్ ప్రొడ్యూసర్. ఊరికే ఆరు నెలలు టైం వేస్ట్ చేశాడు. అడ్వాన్స్ రెండు మూడు లక్షలు ఇచ్చాడు కానీ.. సినిమా మాత్రం చేయలేదు. ఆఫీసుకు పిలుస్తున్నాడు. హుక్కా కొడుతున్నాడు. ముచ్చట్లు చెబుతున్నాడు. ఏదో తేడా కొడుతోందే అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆయనకొక సరదా అంట అది. ప్రతి ఆరు నెలలకో హీరోనో, హీరోయిన్లనో పిలిచి కొన్ని లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వాళ్లను ఆపుతాడట. అదేం సరదానో నాకు అర్థం కాలేదు’’ అని అఖిల్ రాజ్ వెల్లడించాడు.
మరోవైపు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అయిన ‘దొరసాని’ సినిమాలో తాను లీడ్ రోల్ చేయాల్సిందని అఖిల్ రాజ్ తెలిపాడు. ఆ సినిమాకు ఆడిషన్ ఇచ్చానని.. ఆ సినిమాతో తన అరంగేట్రం జరగాల్సిందని.. డెబ్యూకు చాలా దగ్గరగా వెళ్లాక కొన్ని కారణాల వల్ల ఆ సినిమా తాను చేయలేకపోయానని అఖిల్ రాజ్ తెలిపాడు.
This post was last modified on January 3, 2026 11:50 am
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…