ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడం కోసం ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు అడ్వాన్సులిచ్చి.. ఏవో సమస్యలొచ్చి ఆ సినిమాను ఆపేయడం ఇండస్ట్రీలో మామూలే. కానీ సినిమా చేసే ఉద్దేశం లేకపోయినా.. ఊరికే అడ్వాన్సులిచ్చి ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తన వైపు తిప్పించుకుని.. తర్వాత సినిమా లేదు ఏం లేదు అని చెప్పే నిర్మాత కూడా ఇండస్ట్రీలో ఉంటారని ఎవరైనా అనుకుంటారా?
ఇలాంటి ఓ వ్యక్తి టాలీవుడ్లో ఉన్నాడని అంటున్నాడు ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన యువ నటుడు అఖిల్ రాజ్. తనతో ఒక నిర్మాత అలాగే ఆడుకున్నట్లు అతను మా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘‘ఒక నిర్మాత సినిమా ఓపెనింగ్ చేశాడు. అతను ఫేక్ ప్రొడ్యూసర్. ఊరికే ఆరు నెలలు టైం వేస్ట్ చేశాడు. అడ్వాన్స్ రెండు మూడు లక్షలు ఇచ్చాడు కానీ.. సినిమా మాత్రం చేయలేదు. ఆఫీసుకు పిలుస్తున్నాడు. హుక్కా కొడుతున్నాడు. ముచ్చట్లు చెబుతున్నాడు. ఏదో తేడా కొడుతోందే అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆయనకొక సరదా అంట అది. ప్రతి ఆరు నెలలకో హీరోనో, హీరోయిన్లనో పిలిచి కొన్ని లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వాళ్లను ఆపుతాడట. అదేం సరదానో నాకు అర్థం కాలేదు’’ అని అఖిల్ రాజ్ వెల్లడించాడు.
మరోవైపు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అయిన ‘దొరసాని’ సినిమాలో తాను లీడ్ రోల్ చేయాల్సిందని అఖిల్ రాజ్ తెలిపాడు. ఆ సినిమాకు ఆడిషన్ ఇచ్చానని.. ఆ సినిమాతో తన అరంగేట్రం జరగాల్సిందని.. డెబ్యూకు చాలా దగ్గరగా వెళ్లాక కొన్ని కారణాల వల్ల ఆ సినిమా తాను చేయలేకపోయానని అఖిల్ రాజ్ తెలిపాడు.
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…