ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడం కోసం ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు అడ్వాన్సులిచ్చి.. ఏవో సమస్యలొచ్చి ఆ సినిమాను ఆపేయడం ఇండస్ట్రీలో మామూలే. కానీ సినిమా చేసే ఉద్దేశం లేకపోయినా.. ఊరికే అడ్వాన్సులిచ్చి ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తన వైపు తిప్పించుకుని.. తర్వాత సినిమా లేదు ఏం లేదు అని చెప్పే నిర్మాత కూడా ఇండస్ట్రీలో ఉంటారని ఎవరైనా అనుకుంటారా?
ఇలాంటి ఓ వ్యక్తి టాలీవుడ్లో ఉన్నాడని అంటున్నాడు ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన యువ నటుడు అఖిల్ రాజ్. తనతో ఒక నిర్మాత అలాగే ఆడుకున్నట్లు అతను మా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘‘ఒక నిర్మాత సినిమా ఓపెనింగ్ చేశాడు. అతను ఫేక్ ప్రొడ్యూసర్. ఊరికే ఆరు నెలలు టైం వేస్ట్ చేశాడు. అడ్వాన్స్ రెండు మూడు లక్షలు ఇచ్చాడు కానీ.. సినిమా మాత్రం చేయలేదు. ఆఫీసుకు పిలుస్తున్నాడు. హుక్కా కొడుతున్నాడు. ముచ్చట్లు చెబుతున్నాడు. ఏదో తేడా కొడుతోందే అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆయనకొక సరదా అంట అది. ప్రతి ఆరు నెలలకో హీరోనో, హీరోయిన్లనో పిలిచి కొన్ని లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వాళ్లను ఆపుతాడట. అదేం సరదానో నాకు అర్థం కాలేదు’’ అని అఖిల్ రాజ్ వెల్లడించాడు.
మరోవైపు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అయిన ‘దొరసాని’ సినిమాలో తాను లీడ్ రోల్ చేయాల్సిందని అఖిల్ రాజ్ తెలిపాడు. ఆ సినిమాకు ఆడిషన్ ఇచ్చానని.. ఆ సినిమాతో తన అరంగేట్రం జరగాల్సిందని.. డెబ్యూకు చాలా దగ్గరగా వెళ్లాక కొన్ని కారణాల వల్ల ఆ సినిమా తాను చేయలేకపోయానని అఖిల్ రాజ్ తెలిపాడు.
This post was last modified on January 3, 2026 11:50 am
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…