టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా కొనసాగుతున్నాడు ప్రభాస్. కానీ ఎంతకీ తన పెళ్లి కావడం లేదు. కృష్ణంరాజు జీవించి ఉండగానే ప్రభాస్ పెళ్లి చూడాలని చాలా ఆశపడ్డారు. కానీ అది సాధ్యపడలేదు. అలా అని ప్రభాస్కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా.. ఇంట్లో ఆ ప్రయత్నాలు ఆపేశారా అంటే అదేమీ లేదు. గతంలో కృష్ణంరాజు, ఇప్పుడు ఆయన సతీమణి శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూనే ఉన్నారు.
మరి యంగ్ రెబల్ స్టార్ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడో చూడాలి. ఆలోపు ప్రభాస్ వివాహం చర్చోప చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభాస్ పెళ్లి టాపిక్ నేపథ్యంలో గతంలో ఒక సినిమా కూడా రావడం గమనార్హం. ఏఐ పుణ్యమా అని ఈ మధ్య ప్రభాస్ పెళ్లి జరిగిపోయినట్లు వీడియోలు కూడా క్రియేట్ చేసి వదులుతున్నారు. మరోవైపు టాలీవుడ్ సెలబ్రెటీలు సరదాగా ప్రభాస్ వివాహం గురించి తమ సినిమాల ప్రమోషనల్ ఈవెంట్లలో, ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ఉంటారు.
తాజాగా ప్రభాస్కు సన్నిహితుడైన యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి.. తన పెళ్లి గురించి అడిగితే ప్రభాస్ పెళ్లితో ముడిపెట్టేశాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న తన కొత్త చిత్రం అనగనగా ఒక రాజు ప్రమోషన్లలో భాగంగా తాజాగా మీడియాను కలిశాడు నవీన్ పొలిశెట్టి. అక్కడ అతడికి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. దానికి అతను బదులిస్తూ.. తనకెంతో ఇష్టమైన ప్రభాస్ అన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో, ఆ వెంటనే తన వివాహం కూడా జరిగిపోతుందని సెలవిచ్చాడు.
ప్రభాస్ పెళ్లి అయిన 24 గంటలకే తన పెళ్లి కూడా అయిపోతుందని పేర్కొన్నాడు. ఈ సమాధానం విని.. నవీన్ భలే తెలివైనోడే, తనకు పబ్లిక్ పల్స్ బాగా తెలుసే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతికి జరిగే కోడి పందేల్లో పాల్గొంటారా అని అడిగితే.. తనకు వాటి మీద ఆసక్తి లేదన్నాడు నవీన్. దీని గురించి రెట్టించి ప్రశ్నలు అడిగితే.. థంబ్ నైల్స్ కోసం వచ్చారా అంటూ సరదాగా ప్రశ్నించాడు నవీన్. తాను అసలు కోడి కూర తిననని.. తాను వెజిటేరియన్ అని.. దీని మీద థంబ్ నైల్స్ వేయాలని అతను కోరాడు.
This post was last modified on January 2, 2026 12:17 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…