భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత ఏకంగా రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఖచ్చితంగా గురి తప్పరనే నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇందులో వెంకటేష్ ప్రత్యేక క్యామియో చేయడం బజ్ పెంచుతోంది.
అయితే కథను చర్చిస్తున్న క్రమంలో వెంకీ క్యారెక్టర్ ని చిరునే రికమండ్ చేశారని, అందుకే అలా సెట్ చేశానని అనిల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం తెలిసిందే. అయితే సుదీర్ఘమైన తన కెరీర్ లో మిస్ అవ్వకూడదని కోరుకున్న కొన్ని కాంబోలు చిరు ఇలా ప్లాన్ చేస్తున్నారనే సందేహం రావడం సహజం. ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి.
గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ ని తీసుకురావడం వెనుక రామ్ చరణ్ చొరవ ఎంత ఉందో చిరంజీవి ప్రోత్సాహం కూడా అంతే ఉంది. వాల్తేరు వీరయ్యలో రవితేజని రికమండ్ చేయడం, సైరా నరసింహారెడ్డిలో విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ లాంటి హీరోలను భాగం చేయడం, ఇదంతా కొత్త కలయికలను సాధ్యం చేయడం కోసమే అన్నది మూవీ లవర్స్ సందేహం.
బాబీ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోయే గ్యాంగ్ స్టర్ మూవీలో మోహన్ లాల్ ఒక ప్రత్యేక పాత్ర చేయడం దాదాపు ఖరారు అంటున్నారు. నిజమైతే మటుకు మంచి ఫ్రెండ్స్ గా ఉన్న మెగాస్టార్, లాలెట్టాన్ ఫస్ట్ టైం కాంబినేషన్ గా బజ్ తెచ్చుకుంటుంది.
ఫ్యాన్స్ కు ఇదంతా ఓకే కానీ వాళ్ళు కోరుకుంటున్నది వేరే ఉంది. చిరంజీవి సోలోగా ఆయన భుజాల మీద నడిచే బ్లాక్ బస్టర్ పడాలి. బాలయ్యను చూసుకుంటే అఖండ నుంచి డాకు మహారాజ్ దాకా దేంట్లోనూ ఇతర స్టార్లు ఉండరు. అన్నీ విజయాలు సాధించాయి. పోలికని కాదు కానీ ఈ తరహాలో కనక దూసుకెళ్తే మెగా మాస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆకాంక్ష.
రాజకీయాల నుంచి కంబ్యాక్ తర్వాత చిరంజీవి సోలోగా సంతృప్తి పరిచింది ఖైదీ నెంబర్ 150తోనే. మరి అభిమానుల కోరిక శ్రీకాంత్ ఓదెల ఏమైనా తీరుస్తాడేమో చూడాలి. అసలే వయొలెన్స్ స్పెల్లింగ్ ని రక్తంతో రాయించే ఈ యువ దర్శకుడు చిరుని ఎలా ప్రెజెంట్ చేస్తాడో.
This post was last modified on December 31, 2025 7:30 am
'ఫౌజీ' సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు చూస్తుంటే మేకర్స్ ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభాస్ ను సాఫ్ట్…
ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…