సాయికుమార్ నట వారసత్వాన్నందుకుని ఎన్నో ఆశలతో టాలీవుడ్లోకి అడుగు పెట్టాడు ఆది సాయికుమార్. కానీ అరంగేట్రం చేసి దశాబ్దం కావస్తున్నా అతనింకా హీరోగా నిలదొక్కుకోలేదు. రొమాన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా రకరకాల జానర్లు ప్రయత్నించి విఫలమయ్యాడతను. కెరీర్ ఆరంభంలో అయినా ఆది సినిమాలు అంతో ఇంతో ఆడాయి కానీ.. గత కొన్నేళ్లలో అయితే అతడి చిత్రాలు వచ్చింది వెళ్లింది కూడా తెలియట్లేదు. చివరగా జోడి అనే సినిమాతో పలకరించాడతను. కొంచెం గ్యాప్ తర్వాత ఆది ఇప్పుడు జంగిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంతకుముందు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా హార్రర్ జానర్తో జనాల్ని భయపెట్టి వారి మనసులు గెలవాలని చూస్తున్నాడు ఆది.
కార్తీక్-విఘ్నేష్ అనే కొత్త దర్శకులు కలిసి రూపొందించిన చిత్రమిది. దీని టీజర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం భయపెట్టే విజువల్స్, వాయిస్ ఓవర్తో జంగిల్ టీజర్ వరకు అయితే పర్వాలేదనే అనిపిస్తోంది. టీజర్ చూసి కథ మీద ఒక అంచనాకు రావడం కష్టంగానే ఉంది కానీ.. విజువల్స్ అయితే బాగున్నాయి.
తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ సినిమాలో ఆద్యంతం కొనసాగేలా ఉంది. హీరో అని కాకుండా అన్ని పాత్రలనూ ఎలివేట్ చేసేలా టీజర్ సాగింది థియేటర్లో ఈ సినిమా చూసేవాళ్లు బాగానే భయపడటం ఖాయనిపిస్తోంది. ఆదికి జోడీగా నటించిన వేదికనే తన పక్కన కొంచెం పెద్దగా అనిపిస్తోంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండబోతోందని టీజర్ను బట్టి అర్థమవుతోంది. 2021 ఆరంభంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
This post was last modified on December 11, 2020 11:15 pm
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…