Movie News

అమితాబ్ రీఎంట్రీ.. హైద‌రాబాద్ నుంచి

క‌రోనా ఇండియాలో జ‌నాల్ని వ‌ణికించేస్తున్న స‌మ‌యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఆ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌టం అభిమానుల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేసింది. ఆయ‌న వ‌య‌సు 78 ఏళ్లు కావ‌డమే ఆందుకు ప్రధాన కార‌ణం. వృద్ధుల మీద క‌రోనా ఎక్కువ చూపుతుంద‌న్న భ‌యం అభిమానుల‌ను వ‌ణికించింది.

ఐతే అదృష్ట‌వ‌శాత్తూ ఆయ‌న క‌రోనాపై విజ‌యం సాధించారు. మ‌ళ్లీ ఆరోగ్య‌వంతుడ‌య్యారు. ఐతే క‌రోనా అనంత‌ర బ‌డ‌లిక నేప‌థ్యంలో వెంట‌నే ఆయ‌నేమీ షూటింగ్‌ల‌కు వెళ్లిపోలేదు. కొన్ని నెల‌లుగా విశ్రాంతిలోనే ఉన్నారు. ఐతే ఎట్ట‌కేల‌కు ఆయ‌న మ‌ళ్లీ షూటింగ్‌కు రెడీ అయ్యారు.

అమితాబ్ రీఎంట్రీకి వేదిక అవుతోంది హైద‌రాబాదే కావ‌డం విశేషం. లాక్ డౌన్ త‌ర్వాత అమితాబ్ ఒప్పుకున్న తొలి చిత్రం.. మే డే. అజ‌య్ దేవ‌గ‌ణ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణంలో తెర‌కెక్కించ‌నున్న చిత్ర‌మిది. శుక్ర‌వార‌మే హైద‌రాబాద్‌లో ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. హిందీ సినిమాలు చిత్రీక‌ర‌ణ కోసం రామోజీ ఫిలిం సిటీ లాంటి చోట్ల‌కు రావ‌డం మామూలే కానీ.. ఇలా న‌గ‌రంలో వేరే చోట సినిమా ప్రారంభోత్స‌వం జ‌రుపుకోవ‌డం అరుదు.

సినిమా ప్రారంభోత్స‌వం, తొలి షెడ్యూల్ చిత్రీకర‌ణ కోసం హైద‌రాబాద్‌ను అజ‌య్ ఎంచుకున్నాడంటే ఏదో ప్ర‌త్యేక కార‌ణ‌మే ఉంటుంది. ఈ షెడ్యూల్‌లో అమితాబ్‌తో పాటు ఇందులో కీల‌క పాత్ర పోషించ‌నున్న ర‌కుల్ ప్రీత్ సైతం పాల్గొన‌బోతోంది. భారీ బ‌డ్జెట్లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాను 2022 ఏప్రిల్ 22న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్రారంభోత్స‌వం రోజే ప్ర‌క‌టించాడు అజ‌య్.

This post was last modified on December 11, 2020 11:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago