కరోనా ఇండియాలో జనాల్ని వణికించేస్తున్న సమయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆ మహమ్మారి బారిన పడటం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఆయన వయసు 78 ఏళ్లు కావడమే ఆందుకు ప్రధాన కారణం. వృద్ధుల మీద కరోనా ఎక్కువ చూపుతుందన్న భయం అభిమానులను వణికించింది.
ఐతే అదృష్టవశాత్తూ ఆయన కరోనాపై విజయం సాధించారు. మళ్లీ ఆరోగ్యవంతుడయ్యారు. ఐతే కరోనా అనంతర బడలిక నేపథ్యంలో వెంటనే ఆయనేమీ షూటింగ్లకు వెళ్లిపోలేదు. కొన్ని నెలలుగా విశ్రాంతిలోనే ఉన్నారు. ఐతే ఎట్టకేలకు ఆయన మళ్లీ షూటింగ్కు రెడీ అయ్యారు.
అమితాబ్ రీఎంట్రీకి వేదిక అవుతోంది హైదరాబాదే కావడం విశేషం. లాక్ డౌన్ తర్వాత అమితాబ్ ఒప్పుకున్న తొలి చిత్రం.. మే డే. అజయ్ దేవగణ్ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కించనున్న చిత్రమిది. శుక్రవారమే హైదరాబాద్లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. హిందీ సినిమాలు చిత్రీకరణ కోసం రామోజీ ఫిలిం సిటీ లాంటి చోట్లకు రావడం మామూలే కానీ.. ఇలా నగరంలో వేరే చోట సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం అరుదు.
సినిమా ప్రారంభోత్సవం, తొలి షెడ్యూల్ చిత్రీకరణ కోసం హైదరాబాద్ను అజయ్ ఎంచుకున్నాడంటే ఏదో ప్రత్యేక కారణమే ఉంటుంది. ఈ షెడ్యూల్లో అమితాబ్తో పాటు ఇందులో కీలక పాత్ర పోషించనున్న రకుల్ ప్రీత్ సైతం పాల్గొనబోతోంది. భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ సినిమాను 2022 ఏప్రిల్ 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రారంభోత్సవం రోజే ప్రకటించాడు అజయ్.
This post was last modified on December 11, 2020 11:05 pm
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…