కరోనా ఇండియాలో జనాల్ని వణికించేస్తున్న సమయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆ మహమ్మారి బారిన పడటం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఆయన వయసు 78 ఏళ్లు కావడమే ఆందుకు ప్రధాన కారణం. వృద్ధుల మీద కరోనా ఎక్కువ చూపుతుందన్న భయం అభిమానులను వణికించింది.
ఐతే అదృష్టవశాత్తూ ఆయన కరోనాపై విజయం సాధించారు. మళ్లీ ఆరోగ్యవంతుడయ్యారు. ఐతే కరోనా అనంతర బడలిక నేపథ్యంలో వెంటనే ఆయనేమీ షూటింగ్లకు వెళ్లిపోలేదు. కొన్ని నెలలుగా విశ్రాంతిలోనే ఉన్నారు. ఐతే ఎట్టకేలకు ఆయన మళ్లీ షూటింగ్కు రెడీ అయ్యారు.
అమితాబ్ రీఎంట్రీకి వేదిక అవుతోంది హైదరాబాదే కావడం విశేషం. లాక్ డౌన్ తర్వాత అమితాబ్ ఒప్పుకున్న తొలి చిత్రం.. మే డే. అజయ్ దేవగణ్ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కించనున్న చిత్రమిది. శుక్రవారమే హైదరాబాద్లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. హిందీ సినిమాలు చిత్రీకరణ కోసం రామోజీ ఫిలిం సిటీ లాంటి చోట్లకు రావడం మామూలే కానీ.. ఇలా నగరంలో వేరే చోట సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం అరుదు.
సినిమా ప్రారంభోత్సవం, తొలి షెడ్యూల్ చిత్రీకరణ కోసం హైదరాబాద్ను అజయ్ ఎంచుకున్నాడంటే ఏదో ప్రత్యేక కారణమే ఉంటుంది. ఈ షెడ్యూల్లో అమితాబ్తో పాటు ఇందులో కీలక పాత్ర పోషించనున్న రకుల్ ప్రీత్ సైతం పాల్గొనబోతోంది. భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ సినిమాను 2022 ఏప్రిల్ 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రారంభోత్సవం రోజే ప్రకటించాడు అజయ్.
This post was last modified on December 11, 2020 11:05 pm
రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో…
మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్.…
దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే…
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత…
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో…
ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…