ఒకప్పుడు వివిధ భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగింది తమన్నా. కానీ కొన్నేళ్లుగా ఆమె ఐటెం సాంగ్స్కు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. ఒకప్పుడంటే ఈ స్పెషల్ సాంగ్స్ కోసమే వేరే భామలు ఉండేవాళ్లు. కానీ తర్వాత ట్రెండు మారి.. స్టార్ హీరోయిన్లే ఈ పాటలు చేస్తున్నారు. ఈ ట్రెండుకు ఊపు తెచ్చిన హీరోయిన్లలో తమన్నా ఒకరు.
పదేళ్ల ముందు టాప్ హీరోయిన్గా ఉండగానే ‘అల్లుడు శీను’లో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. గత దశాబ్ద కాలంలో ఇండియన్ సినిమాలో అత్యధికంగా ఐటెం సాంగ్స్ చేసిన ఘనత మిల్కీ బ్యూటీకే దక్కుతుంది. గత ఏడాది ‘స్త్రీ-2’లో తమ్మూ చేసిన సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.
ప్రస్తుతం బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘దురంధర్’లో కూడా తమన్నానే ఐటెం సాంగ్ చేయాల్సిందట. కానీ ఏవో కారణాలతో ఆ పాటను క్రిస్టల్ డిసౌజా చేసింది. ఇంకొకరి అవకాశాన్ని తాము తీసుకున్నపుడు.. ఆ ఇంకొకరి గురించి మాట్లాడ్డానికి ఇష్టపడరు. పాజిటివ్ కామెంట్స్ చేయరు. కానీ క్రిస్టల్ డిసౌజా మాత్రం తమన్నా మీద ప్రశంసలు కురిపించింది.
ఆమె ఈ పాట చేస్తే ఇంకా బాగుండేదని పేర్కొంది.
‘‘శరరత్ పాట ఎంపికలో తెర వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ పాటలో ఆయేషా ఖాన్తో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనకు రాసి ఉన్నదే మనకు సొంతమవుతుందని నమ్మతాను. ఈ పాట నాకు రాసి ఉంది. తమన్నా గొప్ప నటి. డ్యాన్స్ చాలా బాగా చేస్తారు. ఒకవేళ ఆమె ఆ పాట చేసి ఉంటే ఇంకా బాగుండేది. తన మ్యాజిక్తో ఆ పాటకు మరింత అందాన్ని జోడించేవారు. ఆమెను చూసి ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎంతో గర్విస్తారు. ఇండస్ట్రీలోని హీరోయిన్లందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నా’’ అని క్రిస్టల్ పేర్కొంది.
This post was last modified on December 29, 2025 1:20 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…