ఒకప్పుడు వివిధ భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగింది తమన్నా. కానీ కొన్నేళ్లుగా ఆమె ఐటెం సాంగ్స్కు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. ఒకప్పుడంటే ఈ స్పెషల్ సాంగ్స్ కోసమే వేరే భామలు ఉండేవాళ్లు. కానీ తర్వాత ట్రెండు మారి.. స్టార్ హీరోయిన్లే ఈ పాటలు చేస్తున్నారు. ఈ ట్రెండుకు ఊపు తెచ్చిన హీరోయిన్లలో తమన్నా ఒకరు.
పదేళ్ల ముందు టాప్ హీరోయిన్గా ఉండగానే ‘అల్లుడు శీను’లో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. గత దశాబ్ద కాలంలో ఇండియన్ సినిమాలో అత్యధికంగా ఐటెం సాంగ్స్ చేసిన ఘనత మిల్కీ బ్యూటీకే దక్కుతుంది. గత ఏడాది ‘స్త్రీ-2’లో తమ్మూ చేసిన సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.
ప్రస్తుతం బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘దురంధర్’లో కూడా తమన్నానే ఐటెం సాంగ్ చేయాల్సిందట. కానీ ఏవో కారణాలతో ఆ పాటను క్రిస్టల్ డిసౌజా చేసింది. ఇంకొకరి అవకాశాన్ని తాము తీసుకున్నపుడు.. ఆ ఇంకొకరి గురించి మాట్లాడ్డానికి ఇష్టపడరు. పాజిటివ్ కామెంట్స్ చేయరు. కానీ క్రిస్టల్ డిసౌజా మాత్రం తమన్నా మీద ప్రశంసలు కురిపించింది.
ఆమె ఈ పాట చేస్తే ఇంకా బాగుండేదని పేర్కొంది.
‘‘శరరత్ పాట ఎంపికలో తెర వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ పాటలో ఆయేషా ఖాన్తో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మనకు రాసి ఉన్నదే మనకు సొంతమవుతుందని నమ్మతాను. ఈ పాట నాకు రాసి ఉంది. తమన్నా గొప్ప నటి. డ్యాన్స్ చాలా బాగా చేస్తారు. ఒకవేళ ఆమె ఆ పాట చేసి ఉంటే ఇంకా బాగుండేది. తన మ్యాజిక్తో ఆ పాటకు మరింత అందాన్ని జోడించేవారు. ఆమెను చూసి ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎంతో గర్విస్తారు. ఇండస్ట్రీలోని హీరోయిన్లందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నా’’ అని క్రిస్టల్ పేర్కొంది.
This post was last modified on December 29, 2025 1:20 pm
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…