Movie News

మహేష్-వంశీ.. క్రేజీ రూమర్


ఇప్పటిదాకా మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ సినిమా తీసిన ఘనత వంశీ పైడిపల్లిదే. వీరి కలయికలో గత ఏడాది వచ్చిన ‘మహర్షి’ సినిమాకు దాదాపు వంద కోట్ల ఖర్చయింది. ఆ సినిమాకు బిజినెస్ కూడా అదే రేంజిలో జరిగింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర ఎలాగోలా గట్టెక్కేసి ‘హిట్’ అనిపించుకుంది.

ఈ ఊపులో వంశీతో మహేష్ ఇంకో సినిమా చేయాలనుకున్నాడు కానీ.. ఎందుకో అది వర్కవుట్ కాలేదు. మహేష్‌కు కథ నచ్చకే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసి పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ను లైన్లో పెట్టాడని వార్తలొచ్చాయి. మరి వంశీ పరిస్థితేంటి అని అంతా అనుకున్నారు. మహేష్‌ నో చెప్పి పది నెలలువుతున్నా కూడా వంశీ కొత్త సినిమా గురించి ఏ కబురూ వినిపించలేదు. కానీ ఇప్పుడు అతడి తర్వాతి ప్రాజెక్టు గురించి ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది.

వంశీ తన తర్వాతి సినిమాను మళ్లీ మహేష్ బాబుతోనే చేయబోతున్నాడట. ఈసారి వేరే కథ చెప్పి మహేష్‌ను మెప్పించాడట. వీరి కలయికలో ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ రాబోతోందట. ఆ చిత్రానికి ‘స్టేట్ రౌడీ’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారట. ఇదీ రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం. మామూలుగా అయితే లైట్ తీసుకునేవాళ్లేమో కానీ.. మహేష్ భార్య తాజాగా రిలీజ్ చేసిన ఒక ఫొటో ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.

మహేష్ తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోగా.. అందులో వంశీ కూడా ఉన్నాడు. వీళ్లిద్దరూ మళ్లీ కలిశారు అంటే సినిమా లైన్లో ఉన్నట్లే అని భావిస్తున్నారు. నిజంగా మాస్ సినిమానే చేస్తారా.. దానికి చిరంజీవి పాత సినిమా టైటిల్ పెడతారా అన్నది పక్కన పెడితే.. మహేష్-వంశీ కాంబినేషన్లో ఇంకో సినిమా వచ్చే అవకాశాల్నయితే కొట్టి పారేయలేమనే అనిపిస్తోంది.

This post was last modified on December 11, 2020 2:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

14 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

6 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

6 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago