ఇప్పటిదాకా మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ సినిమా తీసిన ఘనత వంశీ పైడిపల్లిదే. వీరి కలయికలో గత ఏడాది వచ్చిన ‘మహర్షి’ సినిమాకు దాదాపు వంద కోట్ల ఖర్చయింది. ఆ సినిమాకు బిజినెస్ కూడా అదే రేంజిలో జరిగింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర ఎలాగోలా గట్టెక్కేసి ‘హిట్’ అనిపించుకుంది.
ఈ ఊపులో వంశీతో మహేష్ ఇంకో సినిమా చేయాలనుకున్నాడు కానీ.. ఎందుకో అది వర్కవుట్ కాలేదు. మహేష్కు కథ నచ్చకే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసి పరశురామ్తో ‘సర్కారు వారి పాట’ను లైన్లో పెట్టాడని వార్తలొచ్చాయి. మరి వంశీ పరిస్థితేంటి అని అంతా అనుకున్నారు. మహేష్ నో చెప్పి పది నెలలువుతున్నా కూడా వంశీ కొత్త సినిమా గురించి ఏ కబురూ వినిపించలేదు. కానీ ఇప్పుడు అతడి తర్వాతి ప్రాజెక్టు గురించి ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది.
వంశీ తన తర్వాతి సినిమాను మళ్లీ మహేష్ బాబుతోనే చేయబోతున్నాడట. ఈసారి వేరే కథ చెప్పి మహేష్ను మెప్పించాడట. వీరి కలయికలో ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ రాబోతోందట. ఆ చిత్రానికి ‘స్టేట్ రౌడీ’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారట. ఇదీ రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం. మామూలుగా అయితే లైట్ తీసుకునేవాళ్లేమో కానీ.. మహేష్ భార్య తాజాగా రిలీజ్ చేసిన ఒక ఫొటో ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.
మహేష్ తన క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోగా.. అందులో వంశీ కూడా ఉన్నాడు. వీళ్లిద్దరూ మళ్లీ కలిశారు అంటే సినిమా లైన్లో ఉన్నట్లే అని భావిస్తున్నారు. నిజంగా మాస్ సినిమానే చేస్తారా.. దానికి చిరంజీవి పాత సినిమా టైటిల్ పెడతారా అన్నది పక్కన పెడితే.. మహేష్-వంశీ కాంబినేషన్లో ఇంకో సినిమా వచ్చే అవకాశాల్నయితే కొట్టి పారేయలేమనే అనిపిస్తోంది.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…