ప్రభాస్తో పని చేసే ప్రతి ఆర్టిస్టూ, టెక్నీషియనూ తన పెద్ద మనసు గురించి చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా కడుపు పగిలేలా తన ఇంటి విందు భోజనాలు పెట్టించి చంపేస్తుంటాడని సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు తనతో పని చేసిన యూనిట్ సభ్యులు. ప్రభాస్తో కొత్తగా సినిమా చేసే వాళ్లందరూ.. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే క్యారేజీలు, రకరకాల వంటల గురించి పోస్టులు పెట్టడం మ్యాండేటరీ అన్నట్లే.
ఐతే ప్రభాస్ ప్రేమ కేవలం ఫుడ్డుతోనే ఆగిపోదు. వేరే బహుమతులు కూడా అందజేస్తుంటాడు. ఇలా రెబల్ స్టార్ తనకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ గురించి యంగ్ హీరోయిన్ రిద్ధి కుమార్ వెల్లడించింది. ప్రభాస్ తనకు అందమైన చీరను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. ఆమె ప్రభాస్తో కలిసి ‘రాజాసాబ్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
నిన్న హైదరాబాద్లో ‘రాజాసాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రిద్ధి ఎంతో అందమైన తెల్లటి డిజైనర్ చీరలో వచ్చింది. ఈ చీరను మూడేళ్ల ముందు ‘రాజాసాబ్’ సినిమా మొదలైన కొత్తలో ప్రభాస్ బహుమతిగా ఇచ్చాడట. ప్రి రిలీజ్ ఈవెంట్లోనే ఈ చీరను కట్టుకోవాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు దాన్ని అలాగే దాచి ఉంచానని.. ఇప్పుడు దాన్ని ధరించే అవకాశం వచ్చిందని రిద్ధి తెలిపింది.
‘రాజాసాబ్’లో ఉన్న ముగ్గురు అందమైన హీరోయిన్లలో రిద్ధి ఒకరు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్లతో పాటు రిద్ధికి కూడా సినిమాలో కీలక పాత్రే దక్కినట్లు కనిపిస్తోంది. రిద్ధి కెరీర్లో ఇది చాలా పెద్ద అవకావం అనే చెప్పాలి. ఆమె రాజ్ తరుణ్ సరసన ‘లవర్’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయం అయింది. తర్వాత కొన్ని చిన్న చిత్రాల్లో నటించింది. ప్రభాస్ మూవీ ‘రాధేశ్యామ్’లో చిన్న పాత్ర చేసిన ఆమెకు.. ‘రాజాసాబ్’లో కథానాయికల్లో ఒకరిగా నటించే అవకాశం దక్కింది.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…