మాములుగా ప్రభాస్ ఎంత తన స్వంత సినిమా ఈవెంట్ అయినా సరే తక్కువగా మాట్లాడ్డం చాలాసార్లు చూశాం. స్వతహాగా తనలో ఉండే బిడియం కావొచ్చు, ఇంకోటి కావొచ్చు, పూర్తి స్థాయిలో ఓపెన్ కావడం అరుదు. కానీ రాజా సాబ్ వేడుకలో కొత్త డార్లింగ్ కనిపించాడు. రూపంలోనే కాదు అది మాటల్లోనూ బయట పడింది.
గుబురు గెడ్డం, వెనుక చిన్న పిలకతో స్పిరిట్ గెటప్ రివీల్ చేయడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఇక డార్లింగ్స్ ఐ లవ్ యు అంటూ ఎప్పటిలాగే తన ప్రేమను ప్రదర్శిస్తూ మొదలుపెట్టిన ప్రభాస్ ఒక్కొక్కరిని పొగిడే క్రమంలో ప్రత్యేకతను చాటుకున్నాడు. నిర్మాత విశ్వప్రసాద్ అసలు హీరో అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.
సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి, అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, ముఖ్యంగా సీనియర్లవి బాగా ఆడాలి, వాళ్ళ తర్వాతే మేము, వాళ్ళ నుంచి నేర్చుకున్నవే చేస్తున్నాం అంటూ చిరంజీవి – వెంకటేష్ మన శంకరవరప్రసాద్ గురించి ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించడం ఆకట్టుకుంది. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా రేసులో ఉంది కాబట్టి అన్నీ కలిపి ఇలా అడ్రెస్ చేశాడన్న మాట.
అన్నీ హిట్టవ్వాలని కోరుకోవడం నచ్చేసింది. 15 సంవత్సరాల తర్వాత మారుతీ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నాడని, ఇక చూసుకోండి ఏ స్థాయిలో ఉంటుందోనని చెబుతూ ఆయన డెడికేషన్ గురించి స్పీచ్ మధ్యలో ప్రస్తావిస్తూనే ఉన్నాడు.
మొత్తానికి మాటలతో మనసులు గెలుచుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇంత చలిలో రావడం గురించి చెబుతూ ఇబ్బంది పడకండి అని హితవు చెప్పడం మరింత స్పెషల్ అనిపించుకుంది. రాజా సాబ్ మీద అపారమైన నమ్మకం పెట్టుకున్న ప్రభాస్ దాన్ని ప్రసంగం రూపంలో బయటపెట్టాడు.
సో కాంపిటీషన్ ఎంత ఉందనేది పక్కనపెడితే కంటెంట్ కనక సాలిడ్ గా కనెక్ట్ అయితే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ఎస్కెఎన్ అన్నట్టు ఈసారి పందెం కోళ్ల మీద కాదు డైనోసార్ మీద అన్న మాట నిజమవుతుంది. జనవరి 9 థియేటర్లలో అడుగు పెట్టబోతున్న రాజా సాబ్ మూడు గంటల పది నిమిషాల నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు.
This post was last modified on December 28, 2025 12:02 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…