సోషల్ మీడియాలో ఫలానా ఆపద వచ్చిందని సెలబ్రిటీల సహాయం కోరేవాళ్ళు ఎందరో ఉంటారు. వాళ్ళు చెప్పుకున్న బాధ నిజమో కాదో కనుక్కుని తెలుసుకునేంత తీరిక అన్నిసార్లు ఉండదు. అందుకే సహాయం అందించడంలో తొందరపడితే అన్యాయంగా డబ్బు వృధా కావడం జరుగుతుంది.
సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ కు ఇది అనుభవమయ్యింది. ప్రసన్న సందేశ్ అనే వ్యక్తి తన తల్లి చనిపోతే అంత్యక్రియలకు డబ్బులు లేవని ఆర్థిక సాయం కోరుతూ ట్వీట్ పెట్టాడు. ఆవిడ మృతదేహం ఫోటో కూడా ఉండటంతో జివి ప్రకాష్ గుడ్డిగా నమ్మేసి 20 వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశాడు. అసలు ట్విస్ట్ వేరే ఉంది.
సదరు ఫోటో ఎక్కడిదా అంటూ అభిమానులు ఆరా తీస్తే అది రెండేళ్ల క్రితం చనిపోయిన ఒక పెద్దావిడదని ఏఆర్ సెర్చ్ లో దొరికేసింది. దీంతో అకారణంగా జివి ప్రకాష్ సొమ్ము దుర్మార్గుడి చేతికి చేరిందని ఫ్యాన్స్ కలత చెందుతున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో నిజమైన బాధితులకు సాయం అందకుండా పోతుంది.
కరోనా సమయంలో సోనూ సూద్ ఇలాగే వేలాది మందికి సహాయం చేశారు. వాళ్ళలో ఒరిజినల్ డూప్లికేట్ రెండు రకాలూ ఉన్నారు. ఇప్పుడిది క్రమంగా ఒక వైరస్ లా మారిపోవడంతో ఎవరు పడితే వాళ్ళు స్టార్లను దర్శకులను జాలి కథలు చెప్పి మోసం చేయడం పరిపాటి అయ్యింది.
ఇకపై ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేసేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇరవై వేలు జివి ప్రకాష్ కుమార్ కు పెద్ద మొత్తం కాకపోవచ్చు. కానీ అదే సొమ్ము కొందరి జీవితాలను నిలబెట్టొచ్చు. ఒకరి చదువుకు సాయపడవచ్చు. కానీ మోసగాడి అకౌంట్ లో పడ్డం వల్ల ఎంత దుర్వినియోగం అవుతోందో చెప్పనక్కర్లేదు.
ఇదంతా చూసి రేపు ఎవరైనా సెలబ్రిటీ నిజంగా హెల్ప్ చేయాలనుకున్నా ముందుకు రాకపోవచ్చు. దీన్ని కట్టడి చేయడానికి ఎలాంటి చట్టాలు, చర్యలు లేవు. స్టార్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, దర్శక నిర్మాతలు జాగ్రత్తగా ఉంటూ చెక్ చేసుకుని మరీ సహాయం చేయడం అవసరం.
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…
ఈ రోజుల్లో సోషల్ మీడియా నెగెటివిటీ సినిమాలకు ఎంత నష్టం చేకూరుస్తుందో తెలిసిందే. ఫ్యాన్ వార్స్ తీవ్ర స్థాయికి చేరుకుని,…
ఐపీఎల్లో సిక్సర్ల సునామీతో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఇండియా A జట్టు తరఫున ఆడుతూ ఇప్పుడిప్పుడే…
ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం తవ్వుతున్న కొద్దీ సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపుగా రూ.3 వేల కోట్లకు…