మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.. టాలీవుడ్లో కొంచెం పేరున్న బేనరే. కాకపోతే సొంతంగా ఆ సంస్థ సినిమాలు తీయదు. ఇంకేదైనా పేరున్న బేనర్ చూసుకుని దాని భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తుంటుంది. గగనం, ఘాజి, క్షణం సహా మంచి విషయం ఉన్న సినిమాలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఆ సంస్థలో తెరకెక్కాయి. ఐతే ఇప్పటిదాకా లో బడ్జెట్ సినిమాలే తీస్తూ వచ్చిన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తొలిసారిగా ఓ భారీ చిత్రాన్ని లైన్లో పెట్టింది. అదే.. ఆచార్య.
రామ్ చరణ్ ఆధ్వర్యంలోని కొణిదెల ప్రొడక్షన్స్తో కలిసి మెగాస్టార్-కొరటాల శివల క్రేజీ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి. ఓవైపు అంత పెద్ద సినిమా తీస్తూ.. ఇంకోవైపు ఓ చిన్న సినిమాను ఈ సంస్థ మొదలుపెట్టింది. ఇంకా పేరు పెట్టని ఆ సినిమాలో హీరో శ్రీ విష్ణు.
కొంత కాలం కిందట ఆహాలో నేరుగా విడుదలైన జోహార్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన తేజ మర్ని ఈ సినిమాను రూపొందించనున్నాడు. గురువారమే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. బ్రోచేవారెవరురా దర్శకుడు వివేక్ ఆత్రేయ, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో విజిల్ సినిమా ఫేమ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కథానాయిక అమృత నాయర్ కథానాయికగా నటించనుంది.
శ్రీవిష్ణు గత ఏడాది బ్రోచేవారెవరురా సినిమాతోనే కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత రాజ రాజ చోర అనే సినిమా చేశాడు. అది విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మధ్యే రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో గాలి సంపత్ అనే సినిమాను మొదలుపెట్టాడు. అది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అది పూర్తయ్యేలోపే తేజ మర్ని దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లో సినిమాను లైన్లో పెట్టాడు.
This post was last modified on December 10, 2020 10:15 pm
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…