Movie News

ఓవైపు చిరుతో.. మ‌రోవైపు విష్ణుతో

మ్యాట్నీ ఎంట‌ర్టైన్మెంట్స్.. టాలీవుడ్లో కొంచెం పేరున్న బేన‌రే. కాక‌పోతే సొంతంగా ఆ సంస్థ సినిమాలు తీయ‌దు. ఇంకేదైనా పేరున్న బేన‌ర్ చూసుకుని దాని భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తుంటుంది. గ‌గ‌నం, ఘాజి, క్ష‌ణం స‌హా మంచి విష‌యం ఉన్న సినిమాలు చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లోనే ఆ సంస్థలో తెర‌కెక్కాయి. ఐతే ఇప్ప‌టిదాకా లో బ‌డ్జెట్ సినిమాలే తీస్తూ వ‌చ్చిన మ్యాట్నీ ఎంట‌ర్టైన్మెంట్స్ తొలిసారిగా ఓ భారీ చిత్రాన్ని లైన్లో పెట్టింది. అదే.. ఆచార్య‌.

రామ్ చ‌ర‌ణ్ ఆధ్వ‌ర్యంలోని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి మెగాస్టార్-కొర‌టాల శివ‌ల క్రేజీ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మ్యాట్నీ ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నిరంజ‌న్ రెడ్డి. ఓవైపు అంత పెద్ద సినిమా తీస్తూ.. ఇంకోవైపు ఓ చిన్న సినిమాను ఈ సంస్థ మొద‌లుపెట్టింది. ఇంకా పేరు పెట్ట‌ని ఆ సినిమాలో హీరో శ్రీ విష్ణు.

కొంత కాలం కింద‌ట ఆహాలో నేరుగా విడుద‌లైన జోహార్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన తేజ మ‌ర్ని ఈ సినిమాను రూపొందించ‌నున్నాడు. గురువార‌మే ఈ చిత్రం ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. బ్రోచేవారెవ‌రురా ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వ‌రూప్ త‌దిత‌రులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో విజిల్‌ సినిమా ఫేమ్, 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా క‌థానాయిక అమృత నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

శ్రీవిష్ణు గ‌త ఏడాది బ్రోచేవారెవ‌రురా సినిమాతోనే కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ త‌ర్వాత రాజ రాజ చోర అనే సినిమా చేశాడు. అది విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ మ‌ధ్యే రాజేంద్ర ప్ర‌సాద్ కాంబినేష‌న్లో అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో గాలి సంప‌త్ అనే సినిమాను మొద‌లుపెట్టాడు. అది శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అది పూర్త‌య్యేలోపే తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో మ్యాట్నీ ఎంట‌ర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేన‌ర్లో సినిమాను లైన్లో పెట్టాడు.

This post was last modified on December 10, 2020 10:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

9 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago