మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.. టాలీవుడ్లో కొంచెం పేరున్న బేనరే. కాకపోతే సొంతంగా ఆ సంస్థ సినిమాలు తీయదు. ఇంకేదైనా పేరున్న బేనర్ చూసుకుని దాని భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తుంటుంది. గగనం, ఘాజి, క్షణం సహా మంచి విషయం ఉన్న సినిమాలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఆ సంస్థలో తెరకెక్కాయి. ఐతే ఇప్పటిదాకా లో బడ్జెట్ సినిమాలే తీస్తూ వచ్చిన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తొలిసారిగా ఓ భారీ చిత్రాన్ని లైన్లో పెట్టింది. అదే.. ఆచార్య.
రామ్ చరణ్ ఆధ్వర్యంలోని కొణిదెల ప్రొడక్షన్స్తో కలిసి మెగాస్టార్-కొరటాల శివల క్రేజీ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి. ఓవైపు అంత పెద్ద సినిమా తీస్తూ.. ఇంకోవైపు ఓ చిన్న సినిమాను ఈ సంస్థ మొదలుపెట్టింది. ఇంకా పేరు పెట్టని ఆ సినిమాలో హీరో శ్రీ విష్ణు.
కొంత కాలం కిందట ఆహాలో నేరుగా విడుదలైన జోహార్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన తేజ మర్ని ఈ సినిమాను రూపొందించనున్నాడు. గురువారమే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. బ్రోచేవారెవరురా దర్శకుడు వివేక్ ఆత్రేయ, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో విజిల్ సినిమా ఫేమ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కథానాయిక అమృత నాయర్ కథానాయికగా నటించనుంది.
శ్రీవిష్ణు గత ఏడాది బ్రోచేవారెవరురా సినిమాతోనే కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత రాజ రాజ చోర అనే సినిమా చేశాడు. అది విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మధ్యే రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో గాలి సంపత్ అనే సినిమాను మొదలుపెట్టాడు. అది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అది పూర్తయ్యేలోపే తేజ మర్ని దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లో సినిమాను లైన్లో పెట్టాడు.
This post was last modified on December 10, 2020 10:15 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…