Movie News

ఓవైపు చిరుతో.. మ‌రోవైపు విష్ణుతో

మ్యాట్నీ ఎంట‌ర్టైన్మెంట్స్.. టాలీవుడ్లో కొంచెం పేరున్న బేన‌రే. కాక‌పోతే సొంతంగా ఆ సంస్థ సినిమాలు తీయ‌దు. ఇంకేదైనా పేరున్న బేన‌ర్ చూసుకుని దాని భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తుంటుంది. గ‌గ‌నం, ఘాజి, క్ష‌ణం స‌హా మంచి విష‌యం ఉన్న సినిమాలు చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లోనే ఆ సంస్థలో తెర‌కెక్కాయి. ఐతే ఇప్ప‌టిదాకా లో బ‌డ్జెట్ సినిమాలే తీస్తూ వ‌చ్చిన మ్యాట్నీ ఎంట‌ర్టైన్మెంట్స్ తొలిసారిగా ఓ భారీ చిత్రాన్ని లైన్లో పెట్టింది. అదే.. ఆచార్య‌.

రామ్ చ‌ర‌ణ్ ఆధ్వ‌ర్యంలోని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి మెగాస్టార్-కొర‌టాల శివ‌ల క్రేజీ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మ్యాట్నీ ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నిరంజ‌న్ రెడ్డి. ఓవైపు అంత పెద్ద సినిమా తీస్తూ.. ఇంకోవైపు ఓ చిన్న సినిమాను ఈ సంస్థ మొద‌లుపెట్టింది. ఇంకా పేరు పెట్ట‌ని ఆ సినిమాలో హీరో శ్రీ విష్ణు.

కొంత కాలం కింద‌ట ఆహాలో నేరుగా విడుద‌లైన జోహార్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన తేజ మ‌ర్ని ఈ సినిమాను రూపొందించ‌నున్నాడు. గురువార‌మే ఈ చిత్రం ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది. బ్రోచేవారెవ‌రురా ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వ‌రూప్ త‌దిత‌రులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో విజిల్‌ సినిమా ఫేమ్, 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా క‌థానాయిక అమృత నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

శ్రీవిష్ణు గ‌త ఏడాది బ్రోచేవారెవ‌రురా సినిమాతోనే కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ త‌ర్వాత రాజ రాజ చోర అనే సినిమా చేశాడు. అది విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ మ‌ధ్యే రాజేంద్ర ప్ర‌సాద్ కాంబినేష‌న్లో అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో గాలి సంప‌త్ అనే సినిమాను మొద‌లుపెట్టాడు. అది శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అది పూర్త‌య్యేలోపే తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో మ్యాట్నీ ఎంట‌ర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేన‌ర్లో సినిమాను లైన్లో పెట్టాడు.

Satya

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

2 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

7 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

9 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

9 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

11 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

13 hours ago