మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.. టాలీవుడ్లో కొంచెం పేరున్న బేనరే. కాకపోతే సొంతంగా ఆ సంస్థ సినిమాలు తీయదు. ఇంకేదైనా పేరున్న బేనర్ చూసుకుని దాని భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తుంటుంది. గగనం, ఘాజి, క్షణం సహా మంచి విషయం ఉన్న సినిమాలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఆ సంస్థలో తెరకెక్కాయి. ఐతే ఇప్పటిదాకా లో బడ్జెట్ సినిమాలే తీస్తూ వచ్చిన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తొలిసారిగా ఓ భారీ చిత్రాన్ని లైన్లో పెట్టింది. అదే.. ఆచార్య.
రామ్ చరణ్ ఆధ్వర్యంలోని కొణిదెల ప్రొడక్షన్స్తో కలిసి మెగాస్టార్-కొరటాల శివల క్రేజీ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి. ఓవైపు అంత పెద్ద సినిమా తీస్తూ.. ఇంకోవైపు ఓ చిన్న సినిమాను ఈ సంస్థ మొదలుపెట్టింది. ఇంకా పేరు పెట్టని ఆ సినిమాలో హీరో శ్రీ విష్ణు.
కొంత కాలం కిందట ఆహాలో నేరుగా విడుదలైన జోహార్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన తేజ మర్ని ఈ సినిమాను రూపొందించనున్నాడు. గురువారమే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. బ్రోచేవారెవరురా దర్శకుడు వివేక్ ఆత్రేయ, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో విజిల్ సినిమా ఫేమ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కథానాయిక అమృత నాయర్ కథానాయికగా నటించనుంది.
శ్రీవిష్ణు గత ఏడాది బ్రోచేవారెవరురా సినిమాతోనే కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత రాజ రాజ చోర అనే సినిమా చేశాడు. అది విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మధ్యే రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో గాలి సంపత్ అనే సినిమాను మొదలుపెట్టాడు. అది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అది పూర్తయ్యేలోపే తేజ మర్ని దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లో సినిమాను లైన్లో పెట్టాడు.
This post was last modified on December 10, 2020 10:15 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…