మన శంకరవరప్రసాద్ గారు విడుదలకు ఇంకో 17 రోజులు మాత్రమే టైం ఉంది. మాములుగా అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో చేసే ప్రమోషన్లు కనిపించక మెగా ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. అవుట్ డోర్ పబ్లిసిటీ, థియేటర్లకు కొత్త హోర్డింగులు పంపించడం లాంటివి బాగానే ఉన్నా, అసలైన సోషల్ మీడియా సౌండ్ వినిపించకపోవడం అభిమానుల ఆందోళనకు కారణమవుతోంది.
అలాని అనిల్ మరీ బిజీగా లేరు. బయట ఈవెంట్లకు గెస్టుగా వస్తున్నారు. టీవీ షోలలో కనిపిస్తున్నారు. నిత్యం తన ప్రెజెన్స్ ఉండేలా ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ వాటిలో మెగా స్టాంప్ కనిపించడం లేదనేది నెటిజెన్ల కామెంట్.
అసలే పోటీ తీవ్రంగా ఉంది. నాలుగు రోజుల ముందే రాజా సాబ్ వచ్చి ఉంటుంది. అప్పటికి వారం అయ్యుండదు కాబట్టి శంకర వరప్రసాద్ గారికి కాంపిటీషన్ పరంగా ప్రభాస్ నుంచి థ్రెట్ అయితే పక్కా. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అనిల్ రావిపూడి నవంబర్ చివరి వారం నుంచే వెరైటీ ప్రోమోలతో హడావిడి మొదలుపెట్టారు.
కానీ ఇప్పుడు డిసెంబర్ చివరికి వస్తున్నా సరైన టీజర్ రాలేదు. రెండు పాటల్లో మీసాల పిల్ల చార్ట్ బస్టర్ కాగా శశిరేఖా ప్రసాదూ ఓకే అనిపించుకునే స్పందన దక్కించుకుంది. కానీ బజ్ పెంచేందుకు ఇవి ఎంత మాత్రం సరిపోవన్నది ఒప్పుకోవాల్సిన విషయం.
అసలే భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నారు. ఒకపక్క ట్రోలింగ్ చేసేందుకు యాంటీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. ఇంకోవైపు అరడజను సినిమాలతో పోటీ చాలా తీవ్రంగా ఉంది. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు రేంజ్ లో వింటేజ్ మెగాస్టార్ ని బయటికి తీశానని చెబుతున్న అనిల్ రావిపూడి వాటి తాలూకు శాంపిల్స్ ని అప్పుడప్పుడు బయటికి వదులుతూ ఉంటే హైప్ మరింత పెరుగుతుంది.
వెంకటేష్ పాత్రని కూడా ప్రమోషన్లలో వాడుకోవాలి. ఇంకో రెండు పాటలు రిలీజ్ చేయాల్సి ఉంది. ఏది ఏమైనా అనిల్ రావిపూడి పరుగులు పెట్టే ప్రమోషన్లు చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on December 25, 2025 9:52 am
సందీప్ రెడ్డి వంగ.. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. అతను ఇప్పటిదాకా కేవలం మూడు సినిమాలే తీశాడు.…
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై…
రంగం ఏదైనా.. వ్యాపారం మరేదైనా గుత్తాధిపత్యం అస్సలు మంచిది కాదు. పోటీ తత్వం లేకుంటే ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు అంతకంతకూ…
తెలంగాణ రాజకీయాల్లో మరింత సెగ పెరుగుతోంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జంపింగ్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటేనే.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు.. గీతా జయంతినాడు ఆయన…
తెలంగాణలో రాజకీయ శపథకాలు పెరుగుతున్నాయి. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ను మరోసారి అధికారంలోకి రానివ్వబోనంటూ సీఎం రేవంత్ రెడ్డి శపథం…