Movie News

‘దురంధర్’కు కార్పొరేట్ బుకింగ్స్… దర్శకుడి పంచ్

ఏడాది చివర్లో బాక్సాఫీస్ వేటకు వచ్చి, సంచలన వసూళ్లు సాధించిన ‘దురంధర్’ సినిమా.. 2025 హైయెస్ట్ గ్రాసర్ రికార్డును సొంతం చేసుకుంది. అంతే కాక ఈ ఏడాది వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా ‘దురంధర్’ రికార్డు సాధించే దిశగా దూసుకెళ్తోంది. ఐతే విడుదలకు ముందు ఈ సినిమా ఇలాంటి సంచలనం రేపుతుందని ఎవ్వరూ అనుకోలేదు. 

ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా.. ఆ మేర వసూళ్లు రాబట్టగలదా అన్న సందేహాలు కలిగాయి. ఎందుకంటే దీని దర్శకుడు ఆదిత్య ధర్‌ది ఒకే ఒక్క సినిమా అనుభవం. హీరో రణ్వీర్ కపూర్ సక్సెస్‌లో లేడు. ట్రైలర్ ఓ మోస్తరుగా అనిపించడం, మూడున్నర గంటలకు పైగా నిడివితో రిలీజ్ చేస్తుండడంతో సినిమా సక్సెస్ మీద సందేహాలు కలిగాయి. 

కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్లింది ‘దురంధర్’. మూడో వారాల తర్వాత కూడా దీని జోరు తగ్గడం లేదు. ఈ సినిమా రిలీజ్ ముంగిట హైప్ పెంచడం కోసం కార్పొరేట్ బుకింగ్స్ పెద్ద ఎత్తున చేయిస్తున్నారని.. టికెట్లు బ్లాక్ చేసి హౌస్ ఫుల్స్ చూపిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. తొలి వీకెండ్లో కూడా ఈ ఆరోపణలు కొనసాగాయి. దీనిపై దర్శక నిర్మాత ఆదిత్య ధర్ తాజాగా స్పందించాడు. 

‘‘దురంధర్ సాధించిన అత్యుత్తమ విజయం ఏంటంటే.. ఈ సినిమాకు సంబంధించి ప్రతి టికెట్ ఆర్గానిగ్గా కొన్నదే. రిలీజ్ టైంలో కార్పొరేట్ బుకింగ్స్ అంటూ ఏడ్చిన వాళ్లంతా ఇప్పుడు హఠాత్తుగా మౌనం వహిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో ‘దురంధర్’ చిరస్థాయిగా నిలిచిపోతుంది. దేశంపై జనాలకు ఉన్న ప్రేమకు ‘దురంధర్’ నిదర్శనం’’ అని పేర్కొన్నాడు. దురంధర్ వసూళ్లు ప్రస్తుతం రూ.900 కోట్లకు చేరువగా ఉన్నాయి. ఈ వీకెండ్ అయ్యేసరికి రూ.1000 కోట్ల మార్కును అందుకునే అవకాశాలున్నాయి.

This post was last modified on December 24, 2025 9:45 pm

Share
Show comments
Published by
Kumar
Tags: dhurandhar

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

7 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago