శివ కార్తికేయన్ హీరోగా ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో నిర్మించిన పరాశక్తి జనవరి 10 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ముందు 14 అనుకున్నారు కానీ జన నాయకుడు ప్రొడ్యూసర్లు థియేటర్లను లాక్ చేసే విధానంలో అనుసరిస్తున్న పద్ధతి వల్ల తాము నష్టపోతున్నామని గుర్తించి పరాశక్తి నిర్మాతలు ముందుకు వచ్చారనే ప్రచారం చెన్నై వర్గాల్లో జోరుగా ఉంది.
కేవలం ఒక్క రోజు గ్యాప్ కాబట్టి స్క్రీన్లను సమానంగా పంచే పద్దతి మీద ఒప్పందాలు జరుగుతున్నాయట. విజయ్ కు అయిదు రోజుల పాటు తిరుగు ఉండదని భావించిన అభిమానులకు పరాశక్తి ఇచ్చిన షాక్ కొంచెం గట్టిగానే తగిలేలా ఉంది.
ఇదిలా ఉండగా పరాశక్తి తెలుగు డబ్బింగ్ రిలీజ్ సమాంతరంగా ఉండకపోవచ్చని లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడున్న కాంపిటీషన్ లో అన్నేసి సినిమాల మధ్య దీన్ని తీసుకొస్తే షోలు చాలాక, జనాలకు రీచ్ కాక దెబ్బ తినొచ్చని భావించి ఒకటి రెండు వారాలు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్.
గతంలోనూ శివ కార్తికేయన్ కు ఇలాగే జరిగింది. 2024 సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ, సైంధవ్ ఉన్న కారణంగా అయలన్ తెలుగు వెర్షన్ రిలీజ్ చేయలేకపోయారు. తర్వాత రకరకాల కారణాల వల్ల థియేటర్ మోక్షం దక్కలేదు. ఇటీవలే శాటిలైట్ ప్రీమియర్ లోనే సదరు అయలన్ దర్శనమిచ్చింది.
సో పరాశక్తి కనక తెలుగు రిలీజ్ డేట్ ఆలస్యం చేస్తే ఇలాంటి రిస్క్ లేకపోలేదు. అమరన్ నుంచి శివ కార్తికేయన్ కు మన దగ్గరా ఇమేజ్ వచ్చింది. మదరాసి డిజాస్టర్ అయినా సరే ఓపెనింగ్స్ డీసెంట్ గా వచ్చాయి. అందుకే పరాశక్తి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లు చేయాలని అనుకున్నాడు.
కాకపోతే ఒకప్పుడు తమిళనాడుని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పరాశక్తి మనోళ్లకు ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చెప్పలేం. జివి ప్రకాష్ సంగీతం, హీరోయిన్ శ్రీలీల పాత్ర, రవి మోహన్ విలనిజం, అధర్వ మురళి క్యారెక్టర్ లాంటి ఆకర్షణలు ఇందులో చాలానే ఉన్నాయి.
This post was last modified on December 24, 2025 9:01 am
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…