Movie News

తెలుగు డబ్బింగ్ చేయకపోవడమే మంచిది

పుష్ప 2, యానిమల్ ని టార్గెట్ చేస్తూ వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్ తెలుగు డబ్బింగ్ కోసం ఇక్కడి అభిమానులు గట్టిగానే ఎదురు చూస్తున్నారు. ముందు డిసెంబర్ 19 అన్నారు. తర్వాత ఇంకో వారం లేట్ అన్నారు. కానీ ఎలాంటి సూచనలు కనిపించలేదు.

తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు దురంధర్ ఇతర బాషల అనువాదాలు థియేటర్ రిలీజ్ చేయడం లేదు. దీనికి కారణాలున్నాయి. మొదటిది ఒరిజినల్ వెర్షన్ ఇప్పటికే ఏపీ తెలంగాణాలో లక్షల సంఖ్యలో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఖర్చు పెట్టుకుని డబ్ చేయించడం ద్వారా ఏదో అద్భుతం జరగడం అనుమానమే.

పైగా సినిమాలో తొంభై శాతం పాకిస్థాన్ లోనే జరుగుతుంది. అక్కడ పాత్రలు తెలుగులో మాట్లాడితే నేచురాలిటీ దెబ్బ తింటుంది. దీని వల్ల దర్శకుడి ఉద్దేశం ఆడియన్స్ కి చేరకపోయే ప్రమాదముంది. అందుకే డ్రాప్ అయ్యారని సమాచారం.

జనవరి 30 నెట్ ఫ్లిక్స్ లో దురంధర్ స్ట్రీమింగ్ కానుందని ముంబై రిపోర్ట్. అప్పుడు మాత్రం అన్ని భాషల్లో అందుబాటులో ఉంచుతారట. అగ్రిమెంట్ టైంలో ఎన్ని లాంగ్వేజెస్ లో ఉండాలనేది రాసుకుంటారు. దానికి అనుగుణంగానే అనువాదం పనులు కూడా నిర్మాతలే చేస్తారు. కాకపోతే వాటిని థియేటర్ రిలీజ్ చేయాలా వద్దానేది మార్కెట్ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.

ఇంకో లాంగ్ వీకెండ్ టార్గెట్ చేసుకున్న దురంధర్ ఇప్పట్లో నెమ్మదించేలా లేదు. జనవరి 1 నుంచి కూడా ఇదే ప్రభంజనం ఉంటుందని నార్త్ ట్రేడ్ అంచనా వేస్తోంది. కొత్త రిలీజ్ తు మేరీ మై తేరా మై తేరి తు మేరాని జనాలు పెద్దగా పట్టించుకోకపోవడమే దానికి సాక్ష్యం.

అల్లు అర్జున్ రికార్డును దాటేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధార్, ఆర్టిస్ట్ అక్షయ్ ఖన్నా డిమాండ్ ఇప్పుడు మాములుగా లేదు. దురంధర్ 2 బిజినెస్ ఆఫర్లు కూడా క్రేజీగా ఉన్నాయి. షారుఖ్, సల్మాన్ ని మించిపోయేలా డీల్స్ జరగొచ్చని ప్రాధమిక అంచనా. అది నిజమైనా ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు.

This post was last modified on December 24, 2025 8:04 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

45 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago