పుష్ప 2, యానిమల్ ని టార్గెట్ చేస్తూ వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్ తెలుగు డబ్బింగ్ కోసం ఇక్కడి అభిమానులు గట్టిగానే ఎదురు చూస్తున్నారు. ముందు డిసెంబర్ 19 అన్నారు. తర్వాత ఇంకో వారం లేట్ అన్నారు. కానీ ఎలాంటి సూచనలు కనిపించలేదు.
తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు దురంధర్ ఇతర బాషల అనువాదాలు థియేటర్ రిలీజ్ చేయడం లేదు. దీనికి కారణాలున్నాయి. మొదటిది ఒరిజినల్ వెర్షన్ ఇప్పటికే ఏపీ తెలంగాణాలో లక్షల సంఖ్యలో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఖర్చు పెట్టుకుని డబ్ చేయించడం ద్వారా ఏదో అద్భుతం జరగడం అనుమానమే.
పైగా సినిమాలో తొంభై శాతం పాకిస్థాన్ లోనే జరుగుతుంది. అక్కడ పాత్రలు తెలుగులో మాట్లాడితే నేచురాలిటీ దెబ్బ తింటుంది. దీని వల్ల దర్శకుడి ఉద్దేశం ఆడియన్స్ కి చేరకపోయే ప్రమాదముంది. అందుకే డ్రాప్ అయ్యారని సమాచారం.
జనవరి 30 నెట్ ఫ్లిక్స్ లో దురంధర్ స్ట్రీమింగ్ కానుందని ముంబై రిపోర్ట్. అప్పుడు మాత్రం అన్ని భాషల్లో అందుబాటులో ఉంచుతారట. అగ్రిమెంట్ టైంలో ఎన్ని లాంగ్వేజెస్ లో ఉండాలనేది రాసుకుంటారు. దానికి అనుగుణంగానే అనువాదం పనులు కూడా నిర్మాతలే చేస్తారు. కాకపోతే వాటిని థియేటర్ రిలీజ్ చేయాలా వద్దానేది మార్కెట్ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది.
ఇంకో లాంగ్ వీకెండ్ టార్గెట్ చేసుకున్న దురంధర్ ఇప్పట్లో నెమ్మదించేలా లేదు. జనవరి 1 నుంచి కూడా ఇదే ప్రభంజనం ఉంటుందని నార్త్ ట్రేడ్ అంచనా వేస్తోంది. కొత్త రిలీజ్ తు మేరీ మై తేరా మై తేరి తు మేరాని జనాలు పెద్దగా పట్టించుకోకపోవడమే దానికి సాక్ష్యం.
అల్లు అర్జున్ రికార్డును దాటేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధార్, ఆర్టిస్ట్ అక్షయ్ ఖన్నా డిమాండ్ ఇప్పుడు మాములుగా లేదు. దురంధర్ 2 బిజినెస్ ఆఫర్లు కూడా క్రేజీగా ఉన్నాయి. షారుఖ్, సల్మాన్ ని మించిపోయేలా డీల్స్ జరగొచ్చని ప్రాధమిక అంచనా. అది నిజమైనా ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on December 24, 2025 8:04 am
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…
ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…
తిరువీర్.. ఈ పేరు చూసి ఇప్పటికీ ఎవరో పరభాషా నటుడు అనుకుంటూ ఉంటారు కానీ.. అతను అచ్చమైన తెలుగు కుర్రాడు. చేసినవి తక్కువ…
ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ దఫా కూడా.. సిట్…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…