ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది కీలక దశకు చేరుకుంది. పలు పబ్లిక్ ప్లేసుల్లో చేయడంతో వీడియో లీకులు బయటికి వస్తున్నాయి. ఎర్రకోట దగ్గర రామ్ చరణ్ నడుస్తున్న ఫోటోలు టీమ్ వదిలినట్టు అనిపించినా తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో మెట్లను ఎక్కి దిగుతున్న సీన్ ఎవరో దూరం నుంచి షూట్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది.
నిజానికి బహిరంగ ప్రదేశాల్లో ప్యాన్ ఇండియా సినిమాలు తీయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. గతంలో వారణాసి సైతం ఈ సమస్యను ఎదురుకుంది. పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా కన్ఫర్మ్ కాక ముందే మహేష్ బాబుతో ఆయన నటించిన సన్నివేశం హల్చల్ చేసింది.
అయితే పెద్ది ఈ లీకులను పెద్దగా పట్టించుకునేలా కనిపించడం లేదు. ఎందుకంటే వీటి వల్ల కథకు కీలకమైన క్లూస్ ఏవీ బయటికి రాలేదు. సో దర్శకుడు బుచ్చిబాబు అందుకే నిశ్చింతగా ఉండొచ్చు. ఇది పెద్దికి సంబంధించి ముఖ్యమైన షెడ్యూల్. క్లైమాక్స్ ఘట్టాన్ని ఇక్కడే తీయబోతున్నారు.
ఇప్పటికే దీని గురించి ఇన్స్ సైడ్ ఇన్ఫో రెంగస్థలంకి పదిరెట్లు అనిపించేలా ఉంటుందని చెప్పడం అభిమానులను తెగ ఊరిస్తోంది. అదే నిజమైతే మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే. ఏపీలోని చిన్న పల్లెటూరు నుంచి ఒక మోటు కుర్రాడు ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది ఎవరూ ఊహించని పాయింట్ తో ఉంటుందని వినికిడి.
మార్చి 27 పెద్ది రిలీజ్ ఉంటుందా లేదా అనే అనుమానాలకు చెక్ పెడుతూ దర్శకుడు బుచ్చిబాబు ఎలాంటి ఆలస్యం లేకుండా ప్లానింగ్ పరుగులు పెట్టిస్తున్నాడు. ప్యారడైజ్ సైతం వెనక్కు తగ్గేదేలే అంటూ సంకేతాలు ఇస్తుండగా, ఒకరు డ్రాప్ అయ్యే సూచనలు లేకపోలేదు. అది ఎవరనేది ఇప్పట్లో తేలేదు.
చికిరి చికిరి చార్ట్ బస్టర్ సక్సెస్ తర్వాత రెండో ఆడియో సింగల్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 31 నూతన సంవత్సర కానుకగా ఇవ్వాలని బుచ్చిబాబు చూస్తున్నారు కానీ సంక్రాంతి సినిమాల హడావిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…