Movie News

లీకులను పెద్దగా పట్టించుకోని ‘పెద్ది’

ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది కీలక దశకు చేరుకుంది. పలు పబ్లిక్ ప్లేసుల్లో చేయడంతో వీడియో లీకులు బయటికి వస్తున్నాయి. ఎర్రకోట దగ్గర రామ్ చరణ్ నడుస్తున్న ఫోటోలు టీమ్ వదిలినట్టు అనిపించినా తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో మెట్లను ఎక్కి దిగుతున్న సీన్ ఎవరో దూరం నుంచి షూట్ చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది.

నిజానికి బహిరంగ ప్రదేశాల్లో ప్యాన్ ఇండియా సినిమాలు తీయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. గతంలో వారణాసి సైతం ఈ సమస్యను ఎదురుకుంది. పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ గా కన్ఫర్మ్ కాక ముందే మహేష్ బాబుతో ఆయన నటించిన సన్నివేశం హల్చల్ చేసింది.

అయితే పెద్ది ఈ లీకులను పెద్దగా పట్టించుకునేలా కనిపించడం లేదు. ఎందుకంటే వీటి వల్ల కథకు కీలకమైన క్లూస్ ఏవీ బయటికి రాలేదు. సో దర్శకుడు బుచ్చిబాబు అందుకే నిశ్చింతగా ఉండొచ్చు. ఇది పెద్దికి సంబంధించి ముఖ్యమైన షెడ్యూల్. క్లైమాక్స్ ఘట్టాన్ని ఇక్కడే తీయబోతున్నారు.

ఇప్పటికే దీని గురించి ఇన్స్ సైడ్ ఇన్ఫో రెంగస్థలంకి పదిరెట్లు అనిపించేలా ఉంటుందని చెప్పడం అభిమానులను తెగ ఊరిస్తోంది. అదే నిజమైతే మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే. ఏపీలోని చిన్న పల్లెటూరు నుంచి ఒక మోటు కుర్రాడు ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేది ఎవరూ ఊహించని పాయింట్ తో ఉంటుందని వినికిడి.

మార్చి 27 పెద్ది రిలీజ్ ఉంటుందా లేదా అనే అనుమానాలకు చెక్ పెడుతూ దర్శకుడు బుచ్చిబాబు ఎలాంటి ఆలస్యం లేకుండా ప్లానింగ్ పరుగులు పెట్టిస్తున్నాడు. ప్యారడైజ్ సైతం వెనక్కు తగ్గేదేలే అంటూ సంకేతాలు ఇస్తుండగా, ఒకరు డ్రాప్ అయ్యే సూచనలు లేకపోలేదు. అది ఎవరనేది ఇప్పట్లో తేలేదు.

చికిరి చికిరి చార్ట్ బస్టర్ సక్సెస్ తర్వాత రెండో ఆడియో సింగల్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 31 నూతన సంవత్సర కానుకగా ఇవ్వాలని బుచ్చిబాబు చూస్తున్నారు కానీ సంక్రాంతి సినిమాల హడావిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

This post was last modified on December 23, 2025 5:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…

24 minutes ago

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

7 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

7 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

8 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

10 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

11 hours ago