16 ఏళ్ల కిందట వచ్చిన ‘అవతార్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ కథకు, ఆ విజువల్స్కు, ఆ ఎఫెక్ట్స్కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్ల రికార్డును అందించారు. ఆ చిత్రం సాధించిన అసాధారణ విజయం చూసి దర్శక నిర్మాత ఒకేసారి నాలుగు సీక్వెల్స్ ప్రారంభించాడు.
తొలి సీక్వెల్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మూడేళ్ల కిందట రిలీజైంది. కానీ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. ప్రి రిలీజ్ బజ్ వల్ల వసూళ్లయితే భారీగా వచ్చాయి. ఐతే నాలుగు రోజుల కిందట రిలీజైన కొత్త సీక్వెల్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ మాత్రం ఇటు పాజిటివ్ రివ్యూలూ తెచ్చుకోలేకపోయింది, అటు ఆశించిన కలెక్షన్లూ సాధించలేకపోతోంది. ‘అవతార్-2’ ఇండియాలో ఓపెనింగ్ వీకెండ్లో సాధించిన వసూళ్లలో సగం కూడా రాబట్టలేకపోయింది ‘అవతార్-3’.
‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’కు మిక్స్డ్ టాక్ వచ్చినా సరే.. తొలి వీకెండ్లో రూ.137 కోట్ల దాకా వసూళ్లు కొల్లగొట్టింది. కానీ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఇండియా వీకెండ్ వసూళ్లు రూ.60 కోట్లకు పరిమితం అయ్యాయి. కొన్ని వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ను దున్నేస్తున్న ‘దురంధర్’ ముందు ‘అవతార్-3’ నిలవలేకపోయింది. కొత్త సినిమా అయిన ‘అవతార్-3’ను పాత చిత్రమైన ‘దురంధర్’ మూడు రోజుల్లో పూర్తిగా డామినేట్ చేసింది. ఆ చిత్రానికి మూడో వీకెండ్లో రూ.95 కోట్ల దాకా వసూళ్లు రావడం విశేషం.
‘అవతార్-3’ అంచనాలను అందుకోలేకపోవడం ‘అఖండ-2’కు కూడా బాగానే కలిసొచ్చింది. రెండో వీకెండ్లో ఆ చిత్రం మంచి వసూళ్లే రాబట్టింది. కేవలం విజువల్స్ కోసం మంచి స్క్రీన్లలో ఈ సినిమా చూడాలి తప్ప.. అంతకుమించి ఇందులో విశేషమేమీ లేదనే అభిప్రాయం జనాల్లోకి బలంగా వెళ్లడంతో ‘అవతార్-3’ని ఆడియన్స్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on December 22, 2025 3:41 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…