అవతార్.. ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న చిత్రం. కంటెంట్తో మెప్పించడమే కాదు.. కలెక్షన్ల వర్షమూ కురిపించిందీ మూవీ. ఈ సినిమా సాధించిన అసాధారణ విజయాన్ని చూసి దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్.. ఏకంగా నాలుగు సీక్వెల్స్ అనౌన్స్ చేశాడు. అవతార్ తీయడానికి పదేళ్లు టైం తీసుకున్న కామెరూన్.. తొలి సీక్వెల్కు ఇంకా ఎక్కువగా 12 ఏళ్ల టైం పెట్టాడు.
కానీ ఇంత టైం తీసుకుని రూపొందించిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మొదటి పార్ట్ అంతటి అంచనాలను అందుకోలేకపోయింది. విజువల్స్ అద్భుతం అంటూనే.. సినిమా బోర్ కొట్టించిందనే అభిప్రాయాన్ని కొంతమంది ప్రేక్షకులు వ్యక్తం చేశారు. రిలీజ్ ముంగిట ఉన్న హైప్ వల్ల వసూళ్లయితే బాగానే వచ్చాయి. కానీ ‘అవతార్ ’ను మాత్రం అది అధిగమించలేకపోయింది.
మూడేళ్లు గడిచాయి. ఇప్పుడు ‘అవతార్’ ఫ్రాంఛైజీలో మూడో సినిమా, సెకండ్ సీక్వెల్.. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ రిలీజైంది. ‘అవతార్-2’ చూసేసరికే జనాలకు ఒక రకంగా మొహం మొత్తింది. పైగా ‘అవతార్-3’ ట్రైలర్ కూడా అంతగా ఎక్కలేదు. ఆ ప్రభావం ఓపెనింగ్స్ మీద బాగానే పడింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు ‘అవతార్’, ‘అవతార్-2’ స్థాయిలో ఆరంభ వసూళ్లు రాలేదు. ఇండియాలో అయితే మూడు వారాల ముందు వచ్చిన ‘దురంధర్’ ఈ శుక్రవారం రోజు సాధించిన వసూళ్లను కూడా అధిగమించలేకపోయింది.
ఇక ఈ చిత్రానికి రివ్యూలు కూడా ఆశాజనకంగా లేవు. మెజారిటీ అభిప్రాయం ఏంటంటే.. విజువల్స్ బాగుంటున్నాయి. కానీ సినిమా బోర్ కొడుతోంది. మూడు గంటల 17 నిమిషాల నిడివిని భరించడం కష్టమని.. నేపథ్యం కొంచెం మారుతున్నప్పటికీ ‘అవతార్’లో ప్రతిసారీ కథ కూడా ఒకేలా ఉంటోందన్న కంప్లైంట్లున్నాయి.
పండోరా గ్రహానికి ప్రమాదం రావడం, మనుషులు దండెత్తి వెళ్లడం.. వారిని నావీలు ఢీకొట్టి గెలవడం.. ఇదే లైన్ మీద కథ నడుస్తోంది. విజువల్స్ బాగున్నాయి కదా అని అందరూ ఈ సినిమాను చూడరు. చూసిన వాళ్లు సంతృప్తి చెందరు. ఈ ఫ్రాంఛైజీ ఇప్పటికే ఓవర్ డోస్ అయిపోయిందని.. ఇక వీటిని ఆపేస్తే మంచిదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ముందే అనౌన్స్ చేసిన మిగతా రెండు సీక్వెల్స్ను కామెరూన్ కట్టిపెట్టేస్తే మంచిదేమో.
This post was last modified on December 20, 2025 6:44 pm
ఏపీ రాజకీయాలను ఫాలో అవుతున్న వారికి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏపీలో…
బీఆర్ ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో సమావేశం నిర్వహించారు.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంతం నెగ్గింది. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పోరాటం ఫలించలేదు.…
బొంబాయి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో మైలురాయిలా నిలిచిపోయిన చిత్రాల్లో ఇదొకటి. 90వ దశకంలో ‘రోజా’తో సంచలనం రేపాక, ‘బొంబాయి’ మూవీతో…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో, అతి పెద్ద స్టార్లలో ఒకడైన ధర్మేంద్ర ఇటీవలే కాలం చేశారు. ‘షోలే’…
నిన్నటి నుంచి అందరూ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. వైస్ కెప్టెన్ రేంజ్ లో ఉన్న శుభ్మన్…