మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో ఇది రివర్స్ లో ఉంది. జనవరి 9 విడుదల కానున్న విజయ్ జన నాయకుడుకి పోటీగా శివ కార్తికేయన్ పరాశక్తి వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముందు అనౌన్స్ చేసిన డేట్ జనవరి 14. దానికి అనుగుణంగానే ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చారు. లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడీ పరాశక్తి తేదీని మార్చి జనవరి 10కే తీసుకొచ్చే ప్లానింగ్ జరుగుతోందట. ఆ మేరకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చి చెన్నైలోని పంపిణీదారులతో ఈ మార్పు గురించి నిర్మాతలు చర్చలు చేస్తున్నట్టు సమాచారం.
ఇక్కడ ఆలోచించాల్సిన కోణాలు చాలా ఉన్నాయి. మొదటిది రాజకీయంగా విజయ్ కు చెక్ పెట్టేందుకు చూస్తున్న అధికార పార్టీ వర్గాలు తమ పరిధిలోనే ఉన్న పరాశక్తి డిస్ట్రిబ్యూషన్ ని ప్రేరేపించడం ద్వారా డేట్ మార్పించారని ఒక వర్షన్ వినిపిస్తోంది. రాజకీయాలకు ముందు ఎంత విజయ్ చివరి సినిమా అయినప్పటికీ పరాశక్తిని తక్కువంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఒకప్పుడు తమిళనాడుని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమం కాన్సెప్ట్ తీసుకుని దర్శకురాలు సుధా కొంగర చాలా ఇంటెన్స్ గా తీశారట. కంటెంట్ కనక జనాలకు కనెక్ట్ అయితే వెల్లువలా థియేటర్లకు వస్తారనే నమ్మకం టీమ్ లో ఉంది.
ఇటువైపు జన నాయకుడుది రెగ్యులర్ స్టోరీనే. భగవంత్ కేసరి పాయింట్ తీసుకుని దానికే దర్శకుడు హెచ్ వినోత్ చాలా మార్పులు తీసుకుని కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందించారట. దీనికి అయిదు రోజుల గ్యాప్ ఇవ్వడం వల్ల భారీ వసూళ్లు విజయ్ ఖాతాలో వెళ్లిపోయే రిస్క్ ఉంది కాబట్టి దాన్ని పంచుకునే ఉద్దేశంతో పరాశక్తిని రంగంలోకి దింపుతున్నారని విజయ్ అభిమానులు కస్సుమంటున్నారు. తెలుగులో చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టితో కాంపిటీషన్ ఉంది కాబట్టి డబ్బింగ్ వెర్షన్ ముందుగా వస్తే ఓపెనింగ్స్ పరంగా హెల్ప్ అవుతుందనేది పరాశక్తి ఆలోచన కావొచ్చు.
This post was last modified on December 19, 2025 5:35 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…