గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఫ్యామిలీ రూటులోకి వచ్చేశాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ కు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చగా డింపుల్ హయతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోటీ విపరీతంగా ఉన్నా సరే పండగ బరిలో దిగుతున్న ఈ సినిమా ఆల్రెడీ థియేటర్ బిజినెస్, ఓటిటి డీల్స్ పూర్తి చేసుకుంది. బిగ్ స్క్రీన్ మీద కచ్చితంగా వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో కాంపిటీషన్ పట్టించుకోకుండా వస్తున్నారు.
కథపరంగా చూసుకుంటే గతంలో చాలాసార్లు చూసిందే. భర్త (రవితేజ)ని శ్రీరామచంద్రుడు అనుకునే ఒక అమాయక భార్య(డింపుల్ హయతి)కి మొగుడే లోకం. కానీ సదరు మహాశయుడు కంపెనీ పని మీద విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడో అమ్మాయి (ఆశికా రంగనాథ్) ని ఇష్టపడి ప్రేమలో పడేలా చేస్తాడు. తిరిగి వచ్చాక అసలు సంకటం మొదలవుతుంది. కొంత కాలం ఏదోలా మేనేజ్ చేసినా ఫైనల్ గా దొరికిపోతాడు. మరి ఈ పద్మవ్యూహం నుంచి ఎలా బయట పడ్డాడు అనేది స్టోరీ. అల్లరి మొగుడు, ఆవిడా మా ఆవిడే, పెళ్ళాం ఊరెళితే లాంటి పాత హిట్స్ ఛాయలు చాలానే ఉన్నాయి కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదైనా దాచారేమో చూడాలి.
ఇలా ఇద్దరితో ప్రేమలో పడే సబ్జెక్టుని రవితేజ లైక్ చేశాడంటే ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. విజువల్స్ పరంగా చెప్పడానికేం లేదు. స్మూత్ గా స్టోరీకు తగ్గట్టు ఉన్నాయి. డింపుల్ హయతి కన్నా ఆశికా రంగనాథ్ గ్లామర్ షో ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. జనవరి 13 విడుదల కాబోతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి, మన శంకరవరప్రసాద్ గారు వచ్చిన రెండో రోజు థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఒకరకంగా చెప్పాలంటే రవితేజ సేఫ్ గేమ్ ఆడినట్టు చెప్పొచ్చు. కాకపోతే ఎప్పుడో వర్కౌట్ అయిన ఈ పాత ఫార్ములాతో దర్శకుడు కిషోర్ తిరుమల కొత్త తరం ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తారో ఇంకో నెలలోపే తేలనుంది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…