Movie News

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్ గా తీసుకుంటే ఇండియాలో ఇంకెక్కడా ఇక్కడ జరిగినంత బిజినెస్ జరగదు. అలాంటిది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఒక్క ఐమాక్స్ స్క్రీన్ కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. హైదరాబాద్ సైతం ఇందుకు నోచుకోకపోయింది. బెంగళూరులో ఐదు ఐమాక్స్ స్క్రీన్లు ఉండడం విశేషం.

ఇంకా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఐమాక్స్ స్క్రీన్లున్నాయి. హాలీవుడ్ భారీ సినిమాలను ఐమాక్స్ స్క్రీన్లలో చూసేందుకు మన సెలబ్రెటీలు చెన్నైకో, బెంగళూరుకో వెళ్తుంటారు. గతంలో ప్రసాద్స్‌లో ఐమాక్స్ స్క్రీన్ ఉండేది. కానీ మధ్యలో ఆ ఒప్పందం టెర్మినేట్ అయింది. ఐతే మళ్ళీ హైదరాబాద్ కు ఐమాక్స్ స్క్రీన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహేష్ బాబు-రాజమౌళిల ‘వారణాసి’ రిలీజయ్యే సమయానికి హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్ రావచ్చని అంటున్నారు.

ఐతే ఐమాక్స్ స్క్రీన్ కోసం మన వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండడం బాగానే ఉంది కానీ.. అది వస్తే అందులో ఉండే టికెట్ ధరలను మన వాళ్లు తట్టుకోగలరా అన్నది సందేహం. ‘అవతార్-3’ సినిమాకు బెంగళూరులోని ఒక ఐమాక్స్ స్క్రీన్లో ఏకంగా రూ.1750 రేటు పెట్టడం విశేషం. సినిమా రేంజిని, దానికున్న డిమాండును బట్టి ఐమాక్స్ స్క్రీన్లో టికెట్ ధర ఉంటుంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై నగరాల్లోనూ క్రేజున్న సినిమాలకు భారీ రేటు పెడుతుంటారు ఐమాక్స్ స్క్రీన్లో.

ఐతే ఆ నగరాల్లో మాదిరి తెలుగు రాష్ట్రాల్లోని సిటీల్లో ఫ్లెక్సీ ప్రైసింగ్‌కు అవకాశం లేకపోవడం, ఇక్కడ టికెట్ ధర మీద క్యాప్ ఉండడమే ఐమాక్స్ స్క్రీన్ రాకపోవడానికి కారణమనే వాదన కూడా ఉంది. రేప్పొద్దున ఐమాక్స్ స్క్రీన్ వస్తే దానికి ఈ నిబంధన అమలు కాకుండా చూడాల్సి ఉంటుంది. ఒక వేళ క్యాప్ తీసేసినా.. ఇంతింత రేట్లు పెడితే మన వాళ్లు తట్టుకోగలరా అన్నది సందేహం. ఐతే ఇక్కడి ప్రేక్షకులు, డిమాండును బట్టి మరీ అంతంత రేట్లు పెట్టకపోవచ్చని.. ఓ మోస్తరు రేట్లతో ఐమాక్స్ స్క్రీన్ ను నడిపిస్తారని ట్రేడ్ పండిట్లు అంటున్నారు.

This post was last modified on December 19, 2025 2:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

5 hours ago