ఓటిటిలో అందరూ సినిమాలు అమ్ముతోంటే… పే పర్ వ్యూ పద్ధతిలో ఏటిటి ద్వారా సినిమాలు అమ్ముకోవచ్చునని రాంగోపాల్వర్మ ఒక ప్రత్యామ్నాయ దారిని చూపించాడు. మోనోపలీ చూపిస్తూ చిన్న సినిమాలను ఓటిటిలు చిదిమేయకుండా ఇది ఒక మంచి మార్గమయి వుండాల్సింది. కానీ వర్మ తన టాలెంట్ని దుర్వినియోగం చేసే సినిమాలు తీసినట్టే ఈ టెక్నాలజీని కూడా అసంబద్ధమయిన షార్ట్ సినిమాలతో సదవకాశాన్ని చెడగొట్టుకున్నాడు. వర్మ తీసిన అడల్ట్ వీడియోలకీ యూట్యూబ్లో తీసే అలాంటి వీడియోలకీ తేడా లేదని జనం తిట్టుకున్నారు.
ఇదిలావుంటే ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకుడిగా విజయం కోసం డర్టీ హరి అనే ఒక అడల్ట్ కంటెంట్ వున్న సినిమా తీసాడు. ఆయన సదరు చిత్రాన్ని అడల్ట్ సినిమాగానే ప్రమోట్ చేస్తూ వచ్చి రిలీజ్కి దగ్గర పడిన ఈ టైమ్లో థ్రిల్లర్ కలర్ ఇస్తున్నాడు. రాంగోపాల్వర్మ తీసిన వీడియోల మాదిరి సినిమానే ఇది కూడా అంటారనేది రాజుగారి భయమట.
అందుకే ఎరోటిక్ థ్రిల్లర్ అనే సంగతి తెలియడానికి ఈసారి థ్రిల్లర్ అంశాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇది కూడా అలా పే పర్ వ్యూ పద్ధతిలోనే విడుదలవుతోంది. థియేటర్లు తెరిచినా కానీ అలా కంటే ఇదే బెస్ట్ అని డిసైడ్ అయ్యారు. మరి ఎంత మంది జనం ఆన్లైన్లో కొని మరీ ఈ సినిమా చూస్తారనేది విడుదలయితే తప్ప చెప్పలేం.
This post was last modified on December 9, 2020 11:41 pm
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…