ఓటిటిలో అందరూ సినిమాలు అమ్ముతోంటే… పే పర్ వ్యూ పద్ధతిలో ఏటిటి ద్వారా సినిమాలు అమ్ముకోవచ్చునని రాంగోపాల్వర్మ ఒక ప్రత్యామ్నాయ దారిని చూపించాడు. మోనోపలీ చూపిస్తూ చిన్న సినిమాలను ఓటిటిలు చిదిమేయకుండా ఇది ఒక మంచి మార్గమయి వుండాల్సింది. కానీ వర్మ తన టాలెంట్ని దుర్వినియోగం చేసే సినిమాలు తీసినట్టే ఈ టెక్నాలజీని కూడా అసంబద్ధమయిన షార్ట్ సినిమాలతో సదవకాశాన్ని చెడగొట్టుకున్నాడు. వర్మ తీసిన అడల్ట్ వీడియోలకీ యూట్యూబ్లో తీసే అలాంటి వీడియోలకీ తేడా లేదని జనం తిట్టుకున్నారు.
ఇదిలావుంటే ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకుడిగా విజయం కోసం డర్టీ హరి అనే ఒక అడల్ట్ కంటెంట్ వున్న సినిమా తీసాడు. ఆయన సదరు చిత్రాన్ని అడల్ట్ సినిమాగానే ప్రమోట్ చేస్తూ వచ్చి రిలీజ్కి దగ్గర పడిన ఈ టైమ్లో థ్రిల్లర్ కలర్ ఇస్తున్నాడు. రాంగోపాల్వర్మ తీసిన వీడియోల మాదిరి సినిమానే ఇది కూడా అంటారనేది రాజుగారి భయమట.
అందుకే ఎరోటిక్ థ్రిల్లర్ అనే సంగతి తెలియడానికి ఈసారి థ్రిల్లర్ అంశాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇది కూడా అలా పే పర్ వ్యూ పద్ధతిలోనే విడుదలవుతోంది. థియేటర్లు తెరిచినా కానీ అలా కంటే ఇదే బెస్ట్ అని డిసైడ్ అయ్యారు. మరి ఎంత మంది జనం ఆన్లైన్లో కొని మరీ ఈ సినిమా చూస్తారనేది విడుదలయితే తప్ప చెప్పలేం.
This post was last modified on December 9, 2020 11:41 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…