ఓటిటిలో అందరూ సినిమాలు అమ్ముతోంటే… పే పర్ వ్యూ పద్ధతిలో ఏటిటి ద్వారా సినిమాలు అమ్ముకోవచ్చునని రాంగోపాల్వర్మ ఒక ప్రత్యామ్నాయ దారిని చూపించాడు. మోనోపలీ చూపిస్తూ చిన్న సినిమాలను ఓటిటిలు చిదిమేయకుండా ఇది ఒక మంచి మార్గమయి వుండాల్సింది. కానీ వర్మ తన టాలెంట్ని దుర్వినియోగం చేసే సినిమాలు తీసినట్టే ఈ టెక్నాలజీని కూడా అసంబద్ధమయిన షార్ట్ సినిమాలతో సదవకాశాన్ని చెడగొట్టుకున్నాడు. వర్మ తీసిన అడల్ట్ వీడియోలకీ యూట్యూబ్లో తీసే అలాంటి వీడియోలకీ తేడా లేదని జనం తిట్టుకున్నారు.
ఇదిలావుంటే ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకుడిగా విజయం కోసం డర్టీ హరి అనే ఒక అడల్ట్ కంటెంట్ వున్న సినిమా తీసాడు. ఆయన సదరు చిత్రాన్ని అడల్ట్ సినిమాగానే ప్రమోట్ చేస్తూ వచ్చి రిలీజ్కి దగ్గర పడిన ఈ టైమ్లో థ్రిల్లర్ కలర్ ఇస్తున్నాడు. రాంగోపాల్వర్మ తీసిన వీడియోల మాదిరి సినిమానే ఇది కూడా అంటారనేది రాజుగారి భయమట.
అందుకే ఎరోటిక్ థ్రిల్లర్ అనే సంగతి తెలియడానికి ఈసారి థ్రిల్లర్ అంశాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇది కూడా అలా పే పర్ వ్యూ పద్ధతిలోనే విడుదలవుతోంది. థియేటర్లు తెరిచినా కానీ అలా కంటే ఇదే బెస్ట్ అని డిసైడ్ అయ్యారు. మరి ఎంత మంది జనం ఆన్లైన్లో కొని మరీ ఈ సినిమా చూస్తారనేది విడుదలయితే తప్ప చెప్పలేం.
This post was last modified on December 9, 2020 11:41 pm
రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో…
మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్.…
దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే…
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత…
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో…
ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…