ఓటిటిలో అందరూ సినిమాలు అమ్ముతోంటే… పే పర్ వ్యూ పద్ధతిలో ఏటిటి ద్వారా సినిమాలు అమ్ముకోవచ్చునని రాంగోపాల్వర్మ ఒక ప్రత్యామ్నాయ దారిని చూపించాడు. మోనోపలీ చూపిస్తూ చిన్న సినిమాలను ఓటిటిలు చిదిమేయకుండా ఇది ఒక మంచి మార్గమయి వుండాల్సింది. కానీ వర్మ తన టాలెంట్ని దుర్వినియోగం చేసే సినిమాలు తీసినట్టే ఈ టెక్నాలజీని కూడా అసంబద్ధమయిన షార్ట్ సినిమాలతో సదవకాశాన్ని చెడగొట్టుకున్నాడు. వర్మ తీసిన అడల్ట్ వీడియోలకీ యూట్యూబ్లో తీసే అలాంటి వీడియోలకీ తేడా లేదని జనం తిట్టుకున్నారు.
ఇదిలావుంటే ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకుడిగా విజయం కోసం డర్టీ హరి అనే ఒక అడల్ట్ కంటెంట్ వున్న సినిమా తీసాడు. ఆయన సదరు చిత్రాన్ని అడల్ట్ సినిమాగానే ప్రమోట్ చేస్తూ వచ్చి రిలీజ్కి దగ్గర పడిన ఈ టైమ్లో థ్రిల్లర్ కలర్ ఇస్తున్నాడు. రాంగోపాల్వర్మ తీసిన వీడియోల మాదిరి సినిమానే ఇది కూడా అంటారనేది రాజుగారి భయమట.
అందుకే ఎరోటిక్ థ్రిల్లర్ అనే సంగతి తెలియడానికి ఈసారి థ్రిల్లర్ అంశాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇది కూడా అలా పే పర్ వ్యూ పద్ధతిలోనే విడుదలవుతోంది. థియేటర్లు తెరిచినా కానీ అలా కంటే ఇదే బెస్ట్ అని డిసైడ్ అయ్యారు. మరి ఎంత మంది జనం ఆన్లైన్లో కొని మరీ ఈ సినిమా చూస్తారనేది విడుదలయితే తప్ప చెప్పలేం.
This post was last modified on December 9, 2020 11:41 pm
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…