ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది అతడికే. కానీ ఎనిమిదేళ్ల కిందట ఒక నటి మీద ఒక గ్యాంగ్తో లైంగిక దాడి చేయించినకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడంతో దిలీప్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఈ కేసులో కొన్ని నెలలు జైల్లో కూడా ఉన్నాడు దిలీప్. ఐతే ఇటీవలే ఈ కేసులో కోర్టు తీర్పు రాగా.. దిలీప్ నిర్దోషి అని తేలింది.
ఈ విషయమై సర్వత్రా తీవ్ర విమర్శలు వచ్చాయి. దాడి చేసిన వాళ్లకు శిక్ష పడ్డప్పటికీ.. ఆ దాడి చేయించిన అసలు నిందితుడిని వదిలేశారంటూ బాధిత నటితో పాటు చాలామంది ఆక్రోశం వెళ్లగక్కారు. కోర్టు తీర్పు విషయమై కొన్ని వారాలుగా నిరసనలు కొనసాగుతూ ఉండగానే దిలీప్ కొత్త సినిమా భభబ విడుదలకు సిద్ధమైంది. ఈ గురువారమే ఈ చిత్రం థియేటర్లలోకి దిగుతోంది. ఐతే ఈ సినిమాను బాయ్కాట్ చేయాలంటూ ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.
ఇటీవల కేరళ ఆర్టీసీ బస్సులో దిలీప్ సినిమా ఒకటి ప్రసారం చేయగా.. బస్సులో ఉన్న మహిళలు ఆ చిత్రాన్ని ఆపాలంటూ గొడవ గొడవ చేయగా.. కండక్టర్ చేసేదేమీ లేక ఆ సినిమాను మార్చాల్సి వచ్చింది. దీని గురించి వార్త మీడియాలో హైలైట్ అయింది. దిలీప్ పట్ల కేరళ మహిళల్లో ఉన్న ఆగ్రహం ఎలాంటిదో చెప్పడానికి ఇది ఉదాహరణ.
తన కొత్త సినిమా విషయంలో కూడా ఇదే వ్యతిరేకత కనిపిస్తోంది. మహిళలు అనే కాక పురుషుల్లోనూ ఒక వర్గం తన సినిమాలను వ్యతిరేకిస్తోంది. ఈ కేసు విషయంలో బాధిత నటికి అన్యాయం జరిగిందని.. ఆమెపై దాడికి సూత్రధారి దిలీపే అయినా అతను నిర్దోషిగా బయటపడడం దారుణమని వారు మండిపడుతున్నారు.
భభబ సినిమాలో మలయాళ టాప్ స్టార్ మోహన్ లాల్ ఒక ప్రత్యేక పాత్ర చేయడం గమనార్హం. ఇందుకుగాను ఆయన్ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇందులో మరో పాత్ర చేసిన వినీత్ శ్రీనివాసన్ మీద కూడా మండిపడుతున్నారు. థియేటర్ల ముందు కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇంత వ్యతిరేకత మధ్య రిలీజవుతున్న భభబ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.
This post was last modified on December 18, 2025 9:03 am
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…