ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది అతడికే. కానీ ఎనిమిదేళ్ల కిందట ఒక నటి మీద ఒక గ్యాంగ్తో లైంగిక దాడి చేయించినకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడంతో దిలీప్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఈ కేసులో కొన్ని నెలలు జైల్లో కూడా ఉన్నాడు దిలీప్. ఐతే ఇటీవలే ఈ కేసులో కోర్టు తీర్పు రాగా.. దిలీప్ నిర్దోషి అని తేలింది.
ఈ విషయమై సర్వత్రా తీవ్ర విమర్శలు వచ్చాయి. దాడి చేసిన వాళ్లకు శిక్ష పడ్డప్పటికీ.. ఆ దాడి చేయించిన అసలు నిందితుడిని వదిలేశారంటూ బాధిత నటితో పాటు చాలామంది ఆక్రోశం వెళ్లగక్కారు. కోర్టు తీర్పు విషయమై కొన్ని వారాలుగా నిరసనలు కొనసాగుతూ ఉండగానే దిలీప్ కొత్త సినిమా భభబ విడుదలకు సిద్ధమైంది. ఈ గురువారమే ఈ చిత్రం థియేటర్లలోకి దిగుతోంది. ఐతే ఈ సినిమాను బాయ్కాట్ చేయాలంటూ ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.
ఇటీవల కేరళ ఆర్టీసీ బస్సులో దిలీప్ సినిమా ఒకటి ప్రసారం చేయగా.. బస్సులో ఉన్న మహిళలు ఆ చిత్రాన్ని ఆపాలంటూ గొడవ గొడవ చేయగా.. కండక్టర్ చేసేదేమీ లేక ఆ సినిమాను మార్చాల్సి వచ్చింది. దీని గురించి వార్త మీడియాలో హైలైట్ అయింది. దిలీప్ పట్ల కేరళ మహిళల్లో ఉన్న ఆగ్రహం ఎలాంటిదో చెప్పడానికి ఇది ఉదాహరణ.
తన కొత్త సినిమా విషయంలో కూడా ఇదే వ్యతిరేకత కనిపిస్తోంది. మహిళలు అనే కాక పురుషుల్లోనూ ఒక వర్గం తన సినిమాలను వ్యతిరేకిస్తోంది. ఈ కేసు విషయంలో బాధిత నటికి అన్యాయం జరిగిందని.. ఆమెపై దాడికి సూత్రధారి దిలీపే అయినా అతను నిర్దోషిగా బయటపడడం దారుణమని వారు మండిపడుతున్నారు.
భభబ సినిమాలో మలయాళ టాప్ స్టార్ మోహన్ లాల్ ఒక ప్రత్యేక పాత్ర చేయడం గమనార్హం. ఇందుకుగాను ఆయన్ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇందులో మరో పాత్ర చేసిన వినీత్ శ్రీనివాసన్ మీద కూడా మండిపడుతున్నారు. థియేటర్ల ముందు కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇంత వ్యతిరేకత మధ్య రిలీజవుతున్న భభబ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.
This post was last modified on December 18, 2025 9:03 am
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…