దురంధర్ ఎక్కడ ఆగుతుందో అర్థం కాక బాలీవుడ్ ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. మాములుగా మంగళవారం లాంటి వీక్ డేస్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా వసూళ్లు తగ్గిపోతాయి. అందులోనూ పన్నెండో రోజు అంటే చెప్పనక్కర్లేదు. కానీ రణ్వీర్ సింగ్ మూవీ దీనికి అతీతంగా రికార్డులు బద్దలు కొడుతోంది. రోజుకు కనీసం పాతిక నుంచి ముప్పై కోట్లకు పైగా వసూలు చేయనిదే ఊరుకోను అనే స్థాయిలో నానా భీభత్సం చేస్తున్నాడు. ఉత్తరాది ట్రేడ్ సమాచారం ప్రకారం ఇప్పటిదాకా నాలుగు వందల యాభై కోట్ల నెట్ సాధించిన దురంధర్ గ్రాస్ రూపంలో ఏడు వందల కోట్లవైపు వేగంగా పరుగులు పెడుతున్నాడు.
శుక్రవారం అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదల కానుంది. దీనికున్న క్రేజ్ తెలిసిందే. మాములుగా అయితే మల్టీప్లెక్స్ యాజమాన్యాలు దీనికి ఎక్కువ షోలు వేసి మిగిలిన వాటికి నామమాత్రంగా కేటాయిస్తారు. దీన్ని కూడా దురంధర్ బ్రేక్ చేశాడు. అంత పెద్ద గ్రాండియర్ వస్తున్నా సరే వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ప్రామిసింగ్ గా ఉండటం దురంధర్ స్టామినాకు నిదర్శనం. నార్త్ లో అఖండ 2 అంత దారుణంగా పోవడానికి కారణం ఇదేనని వేరే చెప్పనక్కర్లేదు. కంటెంట్ సంగతి పక్కనపెడితే కనీస రీచ్ రాకపోవడం వెనుక రీజన్ ఒకటే. దురంధర్ మేనియాలో ఆడియన్స్ దేన్నీ పట్టించుకునే స్టేజిలో లేరు.
ఇప్పుడు అసాధ్యమేమో అనుకున్న వెయ్యి కోట్ల మార్కును దురంధర్ సులభంగా దాటేసేలా ఉన్నాడు. ఈ లాంఛనం క్రిస్మస్ లోపే జరిగినా ఆశ్చర్యం లేదు. ఓటిటి హక్కులు కొన్న నెట్ ఫ్లిక్స్ జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ చేసే ప్లాన్ లో ఉందట. ఈ డేట్ లీకైపోయినా సరే జనం థియేటర్లకు వెళ్లడం మానుకోవడం లేదు. యానిమల్, చావాలను అలవోకగా దాటేస్తున్న దురంధర్ ఫైనల్ ఫిగర్స్ ఎంత పెడతాడో అని బయ్యర్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. దీని దెబ్బకు మార్చ్ 19 విడుదల కావాల్సిన దురంధర్ 2 వాయిదా పడొచ్చట. అన్నీ పక్కాగా చూసుకుని ఆగస్ట్ రిలీజ్ టార్గెట్ చేయొచ్చని టాక్.
This post was last modified on December 17, 2025 10:39 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…