Movie News

షాకింగ్… నాగ్ దర్శకుడి మృతి

తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్ కుమార్. ఈ పేరు అంత పాపులర్ కాకపోవచ్చు. కానీ ఆ దర్శకుడు అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరోతో సినిమా తీశాడు. నాగ్ హీరోగా 2006లో వచ్చిన ‘కేడి’ చిత్రాన్ని కిరణే రూపొందించాడు. 

ఐతే ఆ మూవీ ఫ్లాప్ కావడంతో కిరణ్ కెరీర్ ముందుకు సాగలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘క్యూజేకే’ అనే సినిమాను మొదలుపెట్టాడు. దసరా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో ఆకట్టుకున్న దీక్షిత్ శెట్టి ఇందులో ఒక హీరో. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల మరో ప్రధాన పాత్ర పోషించాడు. యుక్తి తరేజా కథానాయిక. దసరా, ది ప్యారడైజ్ చిత్రాల నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా కిరణ్ కన్నుమూయడం ‌యూనిట్‌కు పెద్ద షాక్.

‘క్యూజేకే’ సినిమాను ఘనంగా అనౌన్స్ చేశారు. సినిమా చిత్రీకరణ ఒక దశ వరకు బాగానే జరిగింది. కానీ మధ్యలో కిరణ్ అనారోగ్యం పాలయ్యాడు. దీంతో కొన్ని నెలల పాటు చిత్రీకరణ ఆగిపోయింది. కిరణ్ కొంచెం కోలుకుని ఈ మధ్యే తిరిగి షూట్‌కు వచ్చాడు. కానీ ఇంతలోనే మళ్లీ ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ‘కేడి’ కంటే ముందు అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన ‘యువ’ సీరియల్‌కు పని చేశాడు కిరణ్. తర్వాత అతడికి నాగార్జున ఫీచర్ ఫిలిం డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాడు. 

నాగ్ ఫేవరెట్ ప్రొడ్యూసర్ శివప్రసాద్ రెడ్డి వీరి కలయికలో ‘కేడి’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. కిరణ్ విభిన్న ప్రయత్నమే చేసినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఇండియాలో టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్న సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేయడమే కాక.. సినిమాలో చిన్న క్యారెక్టర్ కూడా చేయడం గమనార్హం.

Kumar

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

36 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

1 hour ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

7 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

9 hours ago