2009లో ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం ‘అవతార్’. ఆ సినిమాకు కొనసాగింపుగా ఏకంగా నాలుగు సీక్వెల్స్ అనౌన్స్ చేశాడు దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్. అందులో తొలి సీక్వెల్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మూడేళ్ల ముందు రిలీజైంది. కానీ ఆ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. సుదీర్ఘ నిడివితో, కొత్తదనం లేని విజువల్స్తో ఒకింత బోర్ కొట్టించిందా సినిమా. కానీ ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లకేమీ ఢోకా లేకపోయింది.
‘అవతార్’లో కాకపోయినా భారీ వసూళ్లే సాధించిందీ చిత్రం. ఇప్పుడు కామెరూన్ ‘అవతార్-3’తో రెడీ అయ్యాడు. ఈ శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించబోతోంది. ‘అవతార్-2’ అనుభవం దృష్ట్యా మూడో భాగం మీద మరీ అంచనాలేమీ లేవు. ఆ సంగతి అడ్వాన్స్ బుకింగ్స్లోనూ ప్రతిఫలిస్తోంది. దీనికి తోడు ‘అవతార్-3’ రివ్యూలు కూడా అంత ఆశాజనకంగా కనిపించడం లేదు.
హాలీవుడ్లో ఆల్రెడీ ఈ సినిమాకు ప్రిమియర్స్ పడ్డాయి. రివ్యూలు మోడరేట్గా ఉన్నాయి. రోటన్ టమోటాస్ 70 పర్సంట్ రేటింగ్ ఇచ్చింది ఈ చిత్రానికి. అవతార్, అవతార్-2లతో పోలిస్తే మూడో భాగానికి ఆ సంస్థ రేటింగ్ తగ్గించింది. బీబీసీ సైతం ‘అవతార్-3’కి నెగెటివ్ రివ్యూనే ఇచ్చింది. ముఖ్యంగా నిడివి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన బీబీసీ.. అవతార్ సిరీస్ను కామెరూన్ ఇంతటితో ఆపేస్తే బెటరని వ్యాఖ్యానించడం గమనార్హం.
వెరైటీ సంస్థ మాత్రం ‘అవతార్-3’కి పాజిటివ్ రివ్యూ ఇచ్చింది. మిగతా రివ్యూల్లో కొన్ని పాజిటివ్గా, కొన్ని నెగెటివ్గా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం మెజారిటీ సమీక్షలు నెగెటివ్గానే ఉన్నాయి. విజువల్గా బాగుంటున్నప్పటికీ ‘అవతార్’ ఓవర్ డోస్ అయిపోతోందని, 3 గంటలకు పైగా నిడివిని భరించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…
మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్తో జరిగే టీ20 మ్యాచ్తో…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…