Movie News

బ్లాక్ బస్టర్ సీక్వెల్ మీద అనుమానాలు

1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా తీసిన విధానం ప్రేక్షకులను దేశభక్తిలో ఓలలాడించింది. ఇప్పుడు దురంధర్ లో రెహమాన్ డెకాయిట్ గా జనాన్ని ఊపేస్తున్న అక్షయ్ ఖన్నా ఇందులో ఒక హీరోగా నటించాడు. ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 3లో బోర్డర్ చోటు దక్కించుకుంది. కమర్షియల్ హంగులు లేకుండా కేవలం యుద్ధ సన్నివేశాలతో జనాన్ని థియేటర్లకు వచ్చేలా చేయడం దీంతోనే మొదలయ్యింది. ఆ తర్వాత చాలా సినిమాలు ఈ బ్యాక్ డ్రాప్ తో వచ్చాయి కానీ బోర్డర్ స్థాయిని టచ్ చేయలేదు.

ఇప్పుడు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత బోర్డర్ 2 రానుంది. సన్నీ డియోల్ తన పాత్రను కంటిన్యూ చేస్తుండగా ఈసారి వరుణ్ ధావన్, దిల్ జిత్ దోస్తాన్జ్, ఆహన్ శెట్టి లాంటి కొత్త జనరేషన్ కుర్రాళ్ళు తోడయ్యారు. కాకపోతే నిర్మాత జెపి దత్తా మళ్ళీ 1971 ఇండో పాక్ వార్ నే కథాంశంగా తీసుకున్నారు. మొదటి భాగంలో ఒక పార్శ్వాన్ని చూపించగా ఈసారి లోంగేవాలా ఎపిసోడ్ హైలైట్ చేయబోతున్నట్టు తెలిసింది. నిన్న టీజర్ రిలీజ్ చేశారు. విజువల్స్ చూస్తుంటే గ్రాఫిక్స్ మోతాదు కాస్త తేలిపోయినట్టు అనిపించింది. ఏఐని సాధారణ జనాలు వాడటం మొదలుపెట్టాక క్వాలిటీ ఏ మాత్రం అటు ఇటు అయినా దర్శకులు దొరికిపోతున్నారు.

బోర్డర్ 2కి దర్శకుడు అనురాగ్ సింగ్. వయసురిత్యా ఆ బాధ్యతలు జెపి దత్తా వద్దనుకున్నారు. అసలే ఆడియన్స్ దురంధర్ హ్యాంగోవర్ లో ఉన్నారు. ఇప్పుడీ బోర్డర్ 2 కనక అంచనాలు అందుకోవడంలో తడబడితే దెబ్బ మాములుగా ఉండదు. సన్నీ డియోల్ ఇంత వయసులోనూ ఈ మూవీ కోసం కష్టపడటం విశేషం. జనవరి 23 విడుదల కాబోతున్న ఈ వార్ మూవీ అన్ని భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. కాకపోతే బోర్డర్ మేజిక్ మళ్ళీ పునఃసృష్టించడం అంత ఈజీగా ఉండదు. గదర్ 2ఆడేసింది కాబట్టి ఇది కూడా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం. ఏమైనా బోర్డర్ బ్రాండ్ చెడగొట్టకపోతే అదే చాలు.

This post was last modified on December 17, 2025 12:08 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Border 2

Recent Posts

ప్రభాస్ కోసం బాస్ వస్తారా

జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…

3 hours ago

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

7 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

7 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

9 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

14 hours ago