జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో ఓపెనింగ్స్ పరంగా భారీ రికార్డులు నమోదు కాబోతున్నాయి. నెంబర్ కనీసం వంద కోట్లతో మొదలవుతుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉండగా రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 28 రామోజీ ఫిలిం సిటీలో చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వారణాసి వేడుక ఇక్కడే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గతంలో సాహో కూడా ఇదే చోట ఈవెంట్ చేశారు. లక్షల్లో పోగయ్యే అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఫిలిం సిటీ అయితేనే బెస్టని టీమ్ భావించిందట.
ఇదిలా ఉండగా రాజా సాబ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. ప్రభాస్, మెగా బాస్ ని ఒకే వేదిక మీద చూడటం కన్నా అభిమానులకు కన్నులపండగ ఇంకేముంటుంది. బయట ప్రైవేట్ గా కలుసుకున్నప్పుడు ప్రభాస్, చిరంజీవి చాలా సన్నిహితంగా ఉంటారు. మెగాస్టార్ మీద డార్లింగ్ కు ఎంత అభిమానముందో పలు సందర్భాల్లో బయట పడింది కూడా. పెదనాన్న కృష్ణంరాజు మన ఊరి పాండవులు సినిమా నుంచే ఈ ఫ్యామిలీతో చిరంజీవికి బాండింగ్ ఏర్పడిపోయింది. రాజా సాబ్ కోసం బాస్ వస్తే అది మరింత బలపడుతుంది.
వేదిక ఒకటే కాబట్టి రాజా సాబ్ ఏం చేసినా వారణాసితో పోలిక వస్తుంది కాబట్టి దాన్ని మించిపోయేలా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్లాన్ చేయాలి. రాజమౌళి సైతం కంట్రోల్ చేయలేకపోయిన కొన్ని అపశ్రుతులు ఇక్కడ రిపీట్ కాకుండా చూసుకోవాలి. పండక్కు విపరీతమైన పోటీ ఉండటం వల్ల రాజా సాబ్ ప్రయాణం అంత ఈజీ కాదు. జనవరి 9 నుంచి 11 దాకా సోలో రిలీజ్ ఎంజాయ్ చేసినా ఆ తర్వాత వరసగా కొత్త రిలీజులు మూకుమ్మడిగా వచ్చేస్తాయి. ఆలోగా రాజా సాబ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఎలాంటి టెన్షన్లు ఉండవు. దర్శకుడు మారుతీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాటు అందరూ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…