బిగ్బాస్ సీజన్ 4లో క్రౌడ్ ఫేవరెట్గా అవతరించాడు అభిజీత్. క్లాస్, యూత్ని అభిజీత్ గెలుచుకున్నాడు. యాంగ్రీ బర్డ్ సోహెల్కి మాస్ కనక్ట్ అయ్యారు. అలాగే అరియానా కూడా తన మార్కు అతి చేష్టలతో ఒక వర్గాన్ని ఆకట్టుకోగలిగింది. అయితే అభిజీత్ గెలుపుని కష్టతరం చేయడానికి బిగ్బాస్ బృందం కొంతకాలంగా స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలో బిగ్బాస్ కుతంత్రం రచిస్తోందనే అనుమానాలు, అపోహలు సర్కులేట్ అవుతున్నాయి.
అరియానా ఓట్ బ్యాంక్ బలోపేతం చేయడం కోసం ఆమెకి క్లోజ్ అయిన అవినాష్ని ఫైనల్కి ముందు ఎలిమినేట్ చేసారని, అతను ఎలిమినేట్ అయిన తర్వాత అరియానాకు ఫుల్ స్క్రీన్ టైమ్ ఇస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వారంలోని బిగ్బాస్ ప్రోమోలు చూస్తే అది నిజమేననిపిస్తోంది. అరియానా తన కష్టాలను చెప్పుకుంటూ ఒక అమ్మాయిని బిగ్బాస్ విజేతను చేయాలని చేసుకున్న విన్నపాన్ని మెయిన్ షోలో చూపించారు. అంతే కాకుండా ఆమెకి ప్రత్యర్ధిలా అనిపిస్తోన్న దేత్తడి హారికను హిప్నటైజ్ చేసి తన ఓట్బ్యాంక్ను చెల్లాచెదురు చేసారు. హారిక ఎలిమినేట్ అయినా ఆమె ఓట్లు అభిజీత్కు పడకుండా చూసుకుంటున్నారు. అలాగే షో టైమింగ్స్ తొమ్మిదిన్నర నుంచి పది గంటలకు మార్చేసారు. దీని వల్ల ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కొందరు తగ్గిపోతారు. పొద్దున్న ఆన్లైన్ క్లాసులవీ వుంటాయి కనుక ఈ వర్గం ఈ టైమింగ్స్ కి అంత తేలికగా షిఫ్ట్ అవలేరు.
ఇదంతా కూడా అభిజీత్ని కార్నర్ చేయడానికే అన్నట్టుగా ఫాన్స్ గగ్గోలు పెడుతున్నారు. సోహైల్, అరియానాకు మాత్రమే స్క్రీన్ టైమ్ ఇస్తూ కావాలని అభిజీత్ని తక్కువ చేస్తున్నారని, అలాగే హారికను ఎలిమినేట్ చేసే కుతంత్రాన్ని పన్నారని అభియోగాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో బిగ్బాస్కే తెలియాలి.
This post was last modified on December 9, 2020 11:42 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…