ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్ సోషల్ మీడియాలో కనిపించాలి. కానీ అంత హడావిడి లేదు. వీరాభిమానులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు కానీ ఏదో వెర్రెత్తిపోయే రేంజ్ లో ట్వీట్లు గట్రా పెట్టడం లేదు. అవతార్ 2తో పోల్చుకుంటే ఓపెనింగ్ తో పాటు ఫైనల్ నెంబర్స్ తక్కువగా ఉండొచ్చని ట్రేడ్ అంచనాలు వేస్తోంది. ఒక్క ఇండియా నుంచే నాలుగు వందల యాభై నుంచి అయిదు వందల కోట్ల దాకా గ్రాస్ ఆశిస్తున్న నిర్మాతలు దాన్ని అందుకోవడం గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు హాలీవుడ్ రిపోర్ట్స్.
అయితే అవతార్ క్రేజ్ తగ్గిందా అని ప్రశ్నించుకుంటే అవుననే సమాధానం కనిపిస్తుంది. ఎందుకంటే అవతార్ మొదటిసారి చూసినప్పుడు ఆడియన్స్ సంభ్రమాశ్చర్యాల్లో మునిగి తేలారు. ఎప్పుడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని జేమ్స్ క్యామరూన్ ఆవిష్కరించిన తీరుకి కనకవర్షం కురిపించారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో వంద రోజులు ఆడే స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోవడం మాములు విషయం కాదు. అవతార్ 2కి క్రేజ్ వచ్చిన మాట వాస్తవమే కానీ అంచనాలను పూర్తిగా అందుకోలేదనే కామెంట్స్ ప్రేక్షకుల నుంచి వచ్చాయి. అయినా సరే సీక్వెల్ హైప్ వల్ల నాలుగు వందల డెబ్భై కోట్ల దాకా గ్రాస్ వసూలయ్యింది.
ఇప్పుడు ఫైర్ అండ్ యాష్ నిజంగా మేజిక్ చేస్తేనే బయ్యర్లు సేఫ్ అవుతారు. పండోరాలో కొత్తగా యష్ అనే జాతిని ప్రవేశపెట్టిన జేమ్స్ క్యామరూన్ ఈసారి ఎలాంటి కొత్త అనుభూతి ఇస్తారో చూడాలి. లేదూ అదే కథను రెండు మూడు ట్విస్టులు మార్చి మళ్ళీ చూపిస్తా అంటే మాత్రం కష్టమే. ఇప్పటిదాకా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మన దేశంలో అమ్ముడుపోయిన టికెట్లు ఎనభై వేల దాకా ఉన్నాయట. ఇది ఇంకా పెరగాలి. కనీసం రెట్టింపు స్థాయిలో డైలీ నెంబర్లు నమోదు చేయాలి. ఫస్ట్ డే కనీసం నలభై కోట్ల ఓపెనింగ్ వస్తేనే బ్లాక్ బస్టర్ ఆశలు పెట్టుకోవచ్చు. టాక్ ఏ మాత్రం అటుఇటు అయినా సరే దెబ్బ కొంచెం గట్టిగానే పడుతుంది.
This post was last modified on December 14, 2025 10:09 pm
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…