అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని, అంత పెద్ద సమస్య వచ్చి డిసెంబర్ నాలుగు రాత్రి రిలీజ్ కావాల్సిన సినిమాను కొన్ని గంటల ముందు నిలువరించడం సరికాదని, ముందే ఆపేయకుండా చివరి నిముషంలో కేసులు వేయడం గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. టాలీవుడ్ లో యూనిటీ లేదని, అందరూ కలిసి కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని, కానీ అలా జరగడం లేదని, ఇకపై ఇలాంటివి లేకుండా ఐకమత్యంతో అందరూ ఒక్కటిగా సాగాలని హితబోధ చేశాడు. వినడానికి బాగానే ఉంది కానీ తమన్ ఇక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాడు.
ప్రీమియర్లకు కేవలం కొన్ని గంటల ముందు కోర్టు ఆర్డర్ వచ్చి షోలు ఆగిపోయాక పరిశ్రమ పెద్దలు రంగంలోకి దిగారు. సురేష్ బాబు, దిల్ రాజు తదితరులు దీన్ని ఒక కొలిక్కి తేవడానికి చాలానే కష్టపడ్డారు. అసలు ఎరోస్ తో సమస్య ఏళ్ళ తరబడి ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోవాల్సింది సదరు నిర్మాతలు. ఒకవేళ తీవ్రమైన ఇబ్బంది ఏర్పడి అదేదో ముందే బయటికి చెప్పుకుని ఉంటే ఎవరో ఒకరు సహాయం చేసేవాళ్ళు. కానీ గుట్టుగా ఉంచడం వల్ల వ్యవహారం తీవ్రంగా మారిపోయింది. నిర్మాత పడే టెన్షన్, నరకం అర్థం చేసుకోవాలి. అలాని తప్పులో పొరపాట్లో జరిగినప్పుడు అసలేమయ్యిందో తెలియకుండా ఎవరైనా ఎందుకు వస్తారు.
ఇప్పుడే కాదు తెలుగు సినిమాలో ఐక్యత ప్రతి రోజు కాకపోయినా అవసరమైనప్పుడు బయట పడుతూనే ఉంది. కరోనా వచ్చినప్పుడు సహాయం అందించడంలో అందరూ ఒక్కటై కదిలారు. ఫెడరేషన్ సమ్మె జరిగి షూటింగులు ఆగిపోతే నిద్రలేని రాత్రులతో సొల్యూషన్ కోసం పోరాడిన తెరవెనుక నిర్మాతల లిస్టు పెద్దదే ఉంది. వందల కోట్లతో ముడిపడిన సినిమా వ్యవహారంలో ఎవరి తలనెప్పులు వాళ్ళకున్నాయి. పక్క ప్రొడ్యూసర్ కు హఠాత్తుగా ఒక పాతిక కోట్లు అవసరమైతే నిమిషాల్లో తెచ్చివ్వడం చాలా కష్టం. ఎవరి మానాన వాళ్ళుంటే అఖండ 2 మొన్న రావడం కష్టమయ్యేది. కానీ ఒకటికొకరు చేయూత ఇచ్చుకున్న మాట వాస్తవం.
This post was last modified on December 14, 2025 8:37 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…