రిలీజ్ ముందు బజ్ లేకుండా, విడుదలైన రోజు కొందరు క్రిటిక్స్ దారుణంగా విమర్శించిన దురంధర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని కావు. పదో రోజు ముంబై నగరంలో అర్ధరాత్రి 12 గంటలకు, తెల్లవారుఝామున 4 గంటలకు రౌండ్ ది క్లాక్ షోలు వేయడం చూసి ఇండస్ట్రీ ప్రముఖులు షాక్ తింటున్నారు. హైదరాబాద్ మెయిన్ స్క్రీన్స్ లో ఎక్కడా టికెట్ ముక్క లేదు. అఖండ 2 కాంపిటీషన్ ఉన్నా సరే తెలుగు రాష్ట్రాల్లో ఇంత దూకుడు మీద ఉండటం ఆశ్చర్యమే. డబ్బింగ్ వెర్షన్లు డిసెంబర్ 19 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసలు మ్యాటర్ ఇది కాదు. సీక్వెల్ గురించి.
దురంధర్ 2 వచ్చే ఏడాది మార్చి 19 విడుదల చేస్తామని నిర్మాతలు ఎండ్ కార్డులో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని వినికిడి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ కేవలం వంద రోజుల గ్యాప్ లో రావడం సేఫ్ కాదని, అందుకే ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డేని లక్ష్యంగా చేసుకుంటే భారీ వసూళ్లు సొంతం చేసుకోవచ్చని డిస్ట్రిబ్యూటర్లు సూచిస్తున్నారట. పైగా పార్ట్ 2కి సంబందించిన పెండింగ్ వర్క్స్ ఇంకా ఉన్నాయి. దర్శకుడు ఆదిత్య ధార్ మీద ఇప్పుడు బాధ్యత పెరగడంలో ప్రతి అంశాన్ని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
చూస్తుంటే దురంధర్ 2 మార్చిలో రావడం అనుమానమేనని ముంబై వర్గాలు అంటున్నాయి. ఎలాగూ యాభై రోజుల తర్వాతే ఓటిటి స్ట్రీమింగ్ ఉంటుంది. డిజిటల్ లోకి వచ్చాక దురంధర్ రీచ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాని నిషేధించిన అరబ్ తదితర దేశాల సినీ ప్రియులు ఎగబడి చూస్తారు. అందుకే సీక్వెల్ కి స్పేస్ ఉంటే బాగుంటుందనే కోణంలో ప్రొడ్యూసర్లు ఆలోచనలో పడ్డారట. ఒకవేళ ఫ్లాప్ అయ్యుంటే ఈ డిస్కషన్ ఉండేది కాదు కానీ ఊహలకు మించి సక్సెస్ కావడం దురంధర్ టీమ్ మీద తీయనైన ఒత్తిడి తీసుకొచ్చింది. దాన్ని ఎంజాయ్ చేయడం బాగానే ఉంది కానీ రెండో భాగం ఎప్పుడో తేల్చేస్తే బెటర్.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…