ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి హిట్లు పడ్డాక తనకిక తిరుగులేదని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత కథ రివర్స్ అయ్యింది. ఒకదాన్ని మించి మరొకటి వరస డిజాస్టర్లతో తెలుగు నుంచి దూరమై తమిళంకు షిఫ్ట్ అయ్యింది. అక్కడా టైం కలిసి రావడం లేదు. సాలిడ్ బ్లాక్ బస్టర్ పడక అమ్మడు ఇబ్బందులు పడుతోంది. కార్తీతో నటించిన అన్నగారు వస్తారు మీద చాలా ఆశలు పెట్టుకుని ప్రమోషన్లలో యాక్టివ్ గా పాల్గొంది. నిర్మాత జ్ఞానవేల్ రాజా పరిష్కరించే పనిలో ఉన్నారు కానీ ఇప్పట్లో తెమిలేలా లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి అంటున్నారు కానీ నో గ్యారెంటీ.
ఇదొక్కటే కాదు డిసెంబర్ 18 విడుదల కావాల్సిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సైతం పోస్టు పోన్ చేస్తున్నట్టు కొద్దిరోజుల క్రితమే వెల్లడయ్యింది. దర్శకుడు విగ్నేష్ శివన్ తో బడ్జెట్ పరంగా నిర్మాతతో వచ్చిన విభేదాలే దీనికి కారణమని చెన్నై టాక్. ప్రదీప్ రంగనాథన్ లాంటి క్రేజీ హీరో నటించిన మూవీ కావడంతో బిజినెస్ లో క్రేజ్ నెలకొంది. కానీ దాన్ని క్యాష్ చేసుకునే దిశగా నిర్మాణ సంస్థ చొరవ తీసుకోవడం లేదు. ఈ లెక్కన ఒకే నెలలో వారం గ్యాప్ లో రిలీజ్ కావాల్సిన రెండు కృతి శెట్టి సినిమాలు ఆగిపోయాయి. కాకతాళీయంగా రెండింటి సమస్య ఒకటే కాగా సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్నవి కావడం గమనార్హం.
ఈ మొత్తం వ్యవహారంలో కృతి శెట్టి చేసేది ఏమీ లేకపోయినా దురదృష్టం వల్ల టైంకి రావాల్సిన సినిమాలు వాయిదాల పర్వంలో మునిగిపోయాయి. మన దగ్గర ఆమెను మర్చిపోయిన ప్రేక్షకులే ఎక్కువ. రష్మిక మందన్న, శ్రీలీలలాగా కనిపిస్తూ ఉంటే ఆడియన్స్ తో కనెక్టివిటీ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడో సారి దర్శనమిస్తే ఇలాగే అవుతుంది. తెలుగులో తను చేసిన గత సినిమాలు మనమే, కస్టడీ, వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం మరీ దారుణంగా పోయాయి. మలయాళంలో ఏఆర్ఎం ఓ మోస్తరుగా ఆడింది. రవి మోహన్ తో చేసిన జీనీ కూడా రిలీజ్ పరంగా లేట్ అవుతోంది.
This post was last modified on December 13, 2025 10:40 am
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…