నటసింహం బాలయ్య హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన అఖండ్-2 సినిమాలకు బాలారిష్టాలు తీరడం లేదు. ఈ నెల తొలి వారంలోనే విడుదల కావాల్సిన సినిమాకు తమిళనాడు కోర్టు విధించిన ఆంక్షల కారణంగా బ్రేకులు పడ్డాయి. దీంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ గండం నుంచి ఏదో ఒక విధంగా బయటపడ్డామని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా తెలంగాణ హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది.
రెండో విడత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రేపు (శుక్రవారం-12-12) సినిమా రిలీజ్ కానుంది. దీనికి ముందు 11వ తేదీ(గురువారం) రాత్రి ప్రీమియర్షో ప్రదర్శనకు సినిమా రెడీ అయింది. అయితే.. ఈ షో టికెట్ల ధరలను పెంచడం.. అదేవిధంగా రెగ్యులర్ షోలకు కూడా టికెట్ ధరలనురూ.50, రూ.100 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిని విచారించిన హైకోర్టు.. ప్రభుత్వం అలా ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నిస్తూ.. సదరు పిటిషనర్ అభ్యర్థన మేరకు.. టికెట్ల ధరలుపెంచుకునేందుకు ఇచ్చిన జీవోను రద్దు చేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ ప్రభావం సినీ అభిమానులపై ముఖ్యంగా నిర్మాతలపై ఎక్కువగా పడనుంది. ఈ నేపథ్యంలో ఎంతో ఖర్చు చేసి ప్రీమియర్ షోన్ను ప్రదర్శించే విషయంపై నిర్మాతలు తర్జన భర్జనలో పడ్డారు.
ఈ ప్రీమియర్ షోల విషయంలో గందరగోళం ఏర్పడింది. మరోవైపు శుక్రవారం కోర్టు విచారణ ప్రారంభమయ్యే సరికి రెగ్యులర్ షో ప్రారంభమైపోతుంది. ఈ నేపథ్యంలో దీనిని కూడా వాయిదా వేస్తారా? అనే విషయం హాట్ టాపిక్గా మారింది. కోర్టు తీర్పు వచ్చే వరకువెయిట్ చేయడం అంటే.. పెద్ద సవాలే. మరి ఏం చేస్తారన్నది చూడాలి.
This post was last modified on December 11, 2025 5:03 pm
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే…
https://youtu.be/COhEUjI-GEk?si=vlcLiVU0tytCMihG ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా…
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల…
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్కపెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే...తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే…
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…