ఏ సినిమాకైనా ‘ఎ’ సర్టిఫికెట్ ఎందుకు వస్తుంది? అందులో ఇంటిమేట్ సీన్ల డోస్ ఎక్కువ ఉండుండాలి. లేదంటే హింస, రక్తపాతం మోతాదు హద్దులు దాటిపోయి ఉండాలి. లేదంటే డైలాగులు, సన్నివేశాల్లో వల్గారిటీ ఎక్కువుండాలి. కానీ ఇవేవీ లేకపోయినా తమ సినిమా ‘మోగ్లీ’కి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చిందని.. అందుకు ఇందులో ముఖ్య పాత్రధారుల ఇంటెన్స్ యాక్టింగే కారణమని అంటున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.
‘‘సినిమా విషయానికి వస్తే చాలామందికి ఒక అనుమానం ఉంది. ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది. ‘ఎ’ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారో రారో అనుకుంటున్నారు. టైటిలేమో ‘మోగ్లీ’ అని పెట్టి, సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ వస్తే ఎలా అంటున్నారు. సాధారణంగా సినిమాలో రక్తపాతం ఎక్కువ ఉన్నా, వల్గారిటీ ఉన్నా ‘ఎ’ ఇస్తారు. ఆ సన్నివేశాలను తీసేయడమో, బ్లర్ చేయడమో చేయొచ్చు. కానీ అదృష్టమో, దురదృష్టమో కానీ.. ‘ఎ’ రావడానికి ఇందులో ఇంటెన్స్ యాక్టింగే కారణం.
బండి సరోజ్ను నేరుగా చూడడానికి, కెమెరా ముందు చూడడానికి చాలా తేడా ఉంది. సినిమా మొదలైన ఐదు నిమిషాలకే నటనలోని తీవ్రతను ప్రేక్షకులు ఫీలవుతారు. సరోజ్ ఎదురుగా ఉండగా రోషన్ ఎలా నటించాడో తెలియదు’’ అని విశ్వ ప్రసాద్ అన్నారు.
‘కలర్ ఫొటో’తో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రాజ్.. తన రెండో ప్రయత్నంగా ‘మోగ్లీ’ని రూపొందించాడు. సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ ఇందులో హీరోగా నటించాడు. కొత్తమ్మాయి సాక్షి కథానాయిక. బండి సరోజ్ విలన్ పాత్ర చేశాడు. శుక్రవారం రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని ‘అఖండ-2’ వల్ల ఫిబ్రవరికి వాయిదా వేయాలని ఓ దశలో అనుకున్నారు. కానీ తర్వాత ఆలోచన మార్చుకుని ఒక్క రోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.
This post was last modified on December 11, 2025 10:06 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…