Movie News

అవేవీ లేకపోయినా మోగ్లీ’కి ఎ సర్టిఫికెట్

ఏ సినిమాకైనా ‘ఎ’ సర్టిఫికెట్ ఎందుకు వస్తుంది? అందులో ఇంటిమేట్ సీన్ల డోస్ ఎక్కువ ఉండుండాలి. లేదంటే హింస, రక్తపాతం మోతాదు హద్దులు దాటిపోయి ఉండాలి. లేదంటే డైలాగులు, సన్నివేశాల్లో వల్గారిటీ ఎక్కువుండాలి. కానీ ఇవేవీ లేకపోయినా తమ సినిమా ‘మోగ్లీ’కి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చిందని.. అందుకు ఇందులో ముఖ్య పాత్రధారుల ఇంటెన్స్ యాక్టింగే కారణమని అంటున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.

‘‘సినిమా విషయానికి వస్తే చాలామందికి ఒక అనుమానం ఉంది. ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది. ‘ఎ’ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారో రారో అనుకుంటున్నారు. టైటిలేమో ‘మోగ్లీ’ అని పెట్టి, సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ వస్తే ఎలా అంటున్నారు. సాధారణంగా సినిమాలో రక్తపాతం ఎక్కువ ఉన్నా, వల్గారిటీ ఉన్నా ‘ఎ’ ఇస్తారు. ఆ సన్నివేశాలను తీసేయడమో, బ్లర్ చేయడమో చేయొచ్చు. కానీ అదృష్టమో, దురదృష్టమో కానీ.. ‘ఎ’ రావడానికి ఇందులో ఇంటెన్స్ యాక్టింగే కారణం.

బండి సరోజ్‌ను నేరుగా చూడడానికి, కెమెరా ముందు చూడడానికి చాలా తేడా ఉంది. సినిమా మొదలైన ఐదు నిమిషాలకే నటనలోని తీవ్రతను ప్రేక్షకులు ఫీలవుతారు. సరోజ్‌ ఎదురుగా ఉండగా రోషన్ ఎలా నటించాడో తెలియదు’’ అని విశ్వ ప్రసాద్ అన్నారు.

‘కలర్ ఫొటో’తో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రాజ్.. తన రెండో ప్రయత్నంగా ‘మోగ్లీ’ని రూపొందించాడు. సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ ఇందులో హీరోగా నటించాడు. కొత్తమ్మాయి సాక్షి కథానాయిక. బండి సరోజ్ విలన్ పాత్ర చేశాడు. శుక్రవారం రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని ‘అఖండ-2’ వల్ల ఫిబ్రవరికి వాయిదా వేయాలని ఓ దశలో అనుకున్నారు. కానీ తర్వాత ఆలోచన మార్చుకుని ఒక్క రోజు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

Kumar

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

1 minute ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

39 minutes ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

46 minutes ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

57 minutes ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago